టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మెన్ సురేష్ రైనా, తన సహచరుడు, మాజీ సారథి ధోనీనే టీమిండియా అత్యుత్తమ కెప్టెన్ అని అన్నాడు. తాజాగా స్టార్ట్ స్పోర్ట్స్ తమిళ్ నిర్వహించిన ది సూపర్ కింగ్స్ షోలో పాల్గొన్న రైనా, ధోని పై ప్రశంసల వర్షం కురిపించాడు. ధోని కెప్టెన్ గా టీమిండియాను ఉన్నత స్థానం లో నిలబెట్టాడని అలాగే  చెన్నై సూపర్ కింగ్స్ ను కూడా ఐపీఎల్ లో తిరుగులేని జట్టుగా మార్చాడని అందుకే ధోనీనే అత్యుత్తమ కెప్టెనని కితాబిచ్చాడు అలాగే త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 13 సీజన్ లో సత్తా చాటుతామని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే గత కొన్నేళ్ల నుండి టీమిండియాకు ఎంపిక కాలేకపోతున్న రైనా... ఈ ఐపీఎల్ లో రాణించి టీ 20ప్రపంచ కప్ కు ఎంపిక కావాలని పట్టుదలతో వున్నాడు.  
 
ఇక చెన్నై జట్టులో ధోని తరువాత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన క్రికెటర్ రైనానే..  తమిళ అభిమానులు ధోనిని ముద్దగా తల అని పిలుస్తుండగా రైనా చిన్న తలగా పేరు తెచ్చుకున్నాడు. మరి చెన్నై తరపున దాదాపు ప్రతి సీజన్ లో సక్సెస్ అయిన రైనా ఈ సీజన్ లో కూడా సక్సెస్ అవుతాడో లేదో చూడాలి. మార్చి 29నుండి ఐపీఎల్13వ సీజన్ స్టార్ట్ కానుండగా మే 24తో ముగియనుంది. ఇప్పటివరకు చెన్నై మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫీ విజేత కాగా 5 సార్లు రన్నర్ అప్ గా నిలువడం విశేషం.  

మరింత సమాచారం తెలుసుకోండి: