టీం ఇండియా క్రికెట్ లోకి అడుగు పెట్టిన కొద్ది కాలానికే తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆటగాళ్ళలో శిఖర్ ధావన్ ఒకడు. టీం ఇండియా ఓపెనర్ గా తొలి టెస్ట్ మ్యాచ్ లోనే రికార్డ్ ఇన్నింగ్స్ ఆడాడు. అప్పుడే అతనికి గబ్బర్ అనే ముద్దు పేరు కూడా వచ్చింది. అయితే అతని ప్రేమ కథ కూడా కాస్త భిన్నంగానే ఉంటుంది. అతని ఆటలో ఎంత విలక్షణం ఉంటుందో అతని ప్రేమ కూడా దాదాపు అలాగే ఉంటుంది. 

 

గబ్బర్ తన కంటే 15 ఏళ్ళ పెద్ద అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరే ఆయేషా ముఖర్జీ. శిఖర్ ధావన్ మరియు ఆయేషా ముఖర్జీలకు ప్రత్యేకమైన ప్రేమకథ ఉంది. వాస్తవానికి ఆమెను సోషల్ మీడియా ద్వారా కలుసుకున్నాడు ధావన్. ఆయేషా ముఖర్జీ ఒక ఆంగ్లో-ఇండియన్. ఆమె తండ్రి భారతీయుడు మరియు తల్లి ఇంగ్లీష్ సంతతికి చెందిన వ్యక్తి. భారత్ లో పుట్టినా ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లిపోయి అక్కడ స్థిరపడింది. 

 

ఆయేషా ఒక కిక్ బాక్సర్ కూడా.. ముందు ఆమె ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. కాని ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంది. మొదటి వివాహంలో ఆమెకు ఇద్దరు కూతుళ్ళకు జన్మనిచ్చింది. వారి పేర్లే రియా, మరియు అలియా.

 

ఇక్కడ వింత ఏంటీ అంటే తన కూతుళ్ళకంటే ధావన్ కేవలం 15 సంవత్సరాలు మాత్రమే పెద్దాడు. అయితే తండ్రిగా మాత్రం వారికి ఎక్కడా ఏ లోటు చేయదు. ఆమెను ముందు ధావన్ ఫేస్బుక్ లో చూసి ఆ తర్వాత ప్రేమించి తన ప్రేమను ఆమెకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: