టీం ఇండియా క్రికెట్ లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్ యువరాజ్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతర్జాతీయ క్రికెట్ లో వీరి ఇద్దరికీ ప్రత్యేక స్థానం ఉంది. ఒంటి చేత్తో టీం ఇండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించింది ఈ జోడీ. ఇక ఇద్దరూ ఎన్నో మ్యాచుల్లో విలువైన భాగస్వామ్యాలు కూడా నెలకొల్పి జట్టుని ముందు ఉండి నడిపించారు. 

 

అయితే వీళ్ళకు ఒక విషయంలో మాత్రం గట్టిగా చెడింది అంటూ ఉంటారు బాలివుడ్, క్రికెట్ అభిమానులు. సమీరా రెడ్డి, దీపిక పదుకొనేని ఇద్దరూ ప్రేమించారు. సమీరా విషయంలో ఏమో గాని దీపిక విషయంలో మాత్రం ఇద్దరికీ చెడింది. అప్పుడే టీం ఇండియా కెప్టెన్ అయిన ధోని, దీపిక ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత యువరాజ్ తో కూడా దీపిక డేటింగ్ చేసింది. అయితే తను ప్రేమించిన అమ్మాయితో యువీ ఏ విధంగా డేటింగ్ వెళ్తాడు అంటూ ధోని ఫైర్ అయ్యాడు. 

 

అప్పుడు ఇద్దరూ టీం ఇండియాలో స్టార్ ఆటగాళ్ళు. అటు దీపిక కూడా ఇద్దరితో డబుల్ గేమ్ ఆడింది అనే ఆరోపణలు ఉన్నాయి. అటు ధోనిని, ఇటు యువరాజ్ ని వదులుకోలేక ఆమె ఇబ్బంది పడింది అంటూ ఉంటారు. ఇక టీం ఇండియాలో స్టార్ ఆటగాళ్ళుగా ఉన్న ఈ ఇద్దరు ఆ సమయంలో ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదని అంటూ ఉంటారు. ఆ తర్వాత దీపిక ఇద్దరినీ వదిలేసి రణబీర్ ని ప్రేమించింది. 

 

ఇక ఆ సమయంలో ధోనీ పెళ్లి చేసుకున్నా యువరాజ్ ని పిలవలేదు. దీనిపై యువీ ఆగ్రహం వ్యక్తం చేసాడు. తాను తన పెళ్ళికి కనీసం ధోనిని గేటు బయట కూడా నిలబెట్టను అంటూ కామెంట్స్ చేసాడు యువీ. అన్నట్టుగానే తన పెళ్ళికి యువీ, ధోనిని పిలవలేదు. అయితే టీంలో యువి తర్వాత స్థానం కోల్పోవడానికి ప్రధాన కారణం ధోనీనే అనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: