అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన కొంత కాలానికే కనుమరుగు అయిపోయిన ఆటగాళ్ళలో సురేష్ రైనా ఒకడు. భారత జట్టు తరుపున 200పైగా వన్డేలు ఆడిన ఈ ఉత్తరప్రదేశ్ ఆటగాడు ఆ తర్వాత నిలకడ లేక జట్టుకి దూరమయ్యాడు. క్రికెట్ లో ఆశించిన స్థాయిలో సక్సెస్ అవకపోయినా వ్యక్తిగత జీవితంలో, లవ్ లో మాత్రం రైనా దూకుడుగానే వెళ్ళాడు. ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. 

 

సురేష్ రైనా, ఏప్రిల్ 3, 2015 న వివాహం చేసుకున్నాడు. ఢిల్లీలో అత్యంత రహస్యంగా ఈ వివాహం జరిగింది. ఆమె పేరే ప్రియా౦కా చౌదరి. తొలుత ఆమె మాజీ కేంద్ర మంత్రి ప్రపుల్ పటేల్ కుమార్తె అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. అవి ఎంత వరకు నిజమో తెలియకుండానే మీడియా కథనాలు ప్రసారం చేసింది. అయితే ఆ తర్వాత మాత్రం ఆమె కాదని, ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి అని మీడియానే చెప్పింది. 

 

రైనా మరియు ప్రియాంక బాల్య స్నేహితులు. చిన్నప్పటి నుంచీ ఈ జంట ఒకరినొకరు తెలుసుకున్నప్పటికీ, ప్రియాంక కుటుంబం పంజాబ్‌కు నివాసం మార్చిన తర్వాత ఇద్దరూ దూరంగా ఉన్నారు. అయితే ఆ తర్వాత 2008 లో ఆమెను ఒక విమానాశ్రయంలో కలిసినప్పుడు రైనా గుర్తు పట్టాడు. హాలాండ్ వెళ్తుండగా ఆమెను రైనా గుర్తుపట్టాడట ఇదే విషయాన్ని రైనా ఒక ఇంటర్వ్యులో చెప్పాడు. 

 

అయితే ప్రపుల్ పటేల్ కుమార్తె తో రైనాకు ప్రేమాయణం నడిచింది అని ఆ తర్వాత, ప్రపుల్ పటేల్ వార్నింగ్ ఇవ్వడంతో అతను వెనక్కు తగ్గి మరొకరిని పెళ్లి చేసుకున్నాడని చెప్తూ ఉంటారు. ప్రస్తుతం ప్రియాంక, రైనాల దంపతులకు గ్రాసియా అనే కుమార్తె ఉంది. ప్రస్తుతం ఐపియల్ కి మాత్రమే రైనా సేవలు అందిస్తున్నాడు. జాతీయ జట్టులో యువకులతో పోటీ ఎక్కువగా ఉన్న నేపధ్యంలో అతను జట్టుకి దూరమయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: