టీం ఇండియాలోకి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిన వారిలో స్టువర్ట్ బిన్నీ ఒకడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడటం అనేది చాలా మంది కల. దాన్ని నేరవేర్చుకున్నట్టే నెరవేర్చుకుని చేజార్చుకున్నాడు బిన్నీ. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ దూరమైన బిన్నీ వ్యక్తిగత జీవితం మాత్రం చాలా అందంగా ఉంటుంది. టీం ఇండియా మాజీ ఆటగాడు రోజర్ బిన్నీ కుమారుడు అయిన స్టువర్ట్ బిన్నీ యాంకర్ మయాంతి లాంగర్ ని వివాహం చేసుకున్నాడు. 

 

క్రికెట్ గురించి ఏ మాత్రం పరిచయం ఉన్నా సరే ఈమె పేరు దాదాపు అందరికి సుపరిచితమే. ఐపియల్ తో పాటుగా అంతర్జాతీయ క్రికెట్ కి యాంకర్ గా తన సేవలు అందిస్తుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో యాంకర్ గా పని చేస్తున్న మయాంతి, బిన్నీని ప్రేమ వివాహం చేసుకుంది. తన ఉద్యోగంలో భాగంగా మాయంతి బిన్నీని చాలాసార్లు ఇంటర్వ్యూ చేసింది. బిన్నీ ఆమె తెలివి మరియు అందంతో మైమరచిపోయాడు.

 

మైదానంలో తన అనుభవాన్ని పంచుకోవడంతో పాటుగా ఆమెకు తన మనసు ఇచ్చేసాడు. క్రికెట్ పట్ల వారికున్న మమకారం ఆ ఇద్దరినీ దగ్గర చేసింది. కొంత కాలం పాటు డేటింగ్ చేసి ఆ తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ సెప్టెంబర్ 2012 లో ఏడు అడుగులు వేసారు. 2012 నాటికి, మాయంతి అనేక ఫుట్‌బాల్ మరియు క్రికెట్ టోర్నీలకు యాంకర్ గా పని చేసింది. 

 

ఆమెను ప్రేమించక ముందు బిన్నీ పెద్ద గొప్పగా ఏమీ ఆడలేదు. అయితే ఆ తర్వాత మాత్రం అతని ఆటలు చాలా మార్పులు వచ్చాయి. జాతీయ జట్టుకి కూడా సెలెక్ట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత మాత్రం అంతర్జాతీయ క్రికెట్ లో ఎక్కువ కాల౦ ఉండలేకపోయాడు. ఆల్ రౌండర్ గా అడుగుపెట్టి పేలవ ప్రదర్శనతో జట్టులో చోటు కోల్పోయాడు. ఇలా ఇద్దరూ క్రికెట్ ని ప్రేమించి దగ్గరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: