ఉత్తరాఖండ్ జిల్లాలో దారుణం జరిగింది. క్రికెట్ బాల తగిలిందని ఒక వ్యక్తి బాలుడ్ని తన తుపాకీతో కాల్చడం సంచలనంగా మారింది. గురువారం జరిగిన ఈ సంఘటన ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఉత్తరాఖండ్‌లోని టెహ్రీ జిల్లాలో భేటి గ్రామంలో గురువారం పిల్లలు క్రికెట్ ఆడుతున్నప్పుడు బంతి రాం లాల్ అనే వ్యక్తికి తగిలింది. 

 

అక్కడ రాం లాల్, కాందారి అనే ఇద్దరు వ్యక్తులు మద్యం సేవిస్తున్నారు. దీనితో మద్యం మత్తులో ఉన్న రాం లాల్, ఆ బంతిని తీసుకోవడానికి వెళ్ళిన 12 ఏళ్ళ మహేష్ బాలుడిపై కాల్పులు జరిపాడు. దేశీ తుపాకితో కాల్చడం తో బాలుడికి గాయాలు అయ్యాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసారు. నాటు పిస్టల్‌తో రామ్‌లాల్ అతనిపై కాల్పులు జరిపాడని ఘన్సాలీ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి ప్రదీప్ సింగ్ రావత్ తెలిపారు.

 

గ్రామస్తులు బాలుడిని సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు, అక్కడ నుండి అతన్ని ఎయిమ్స్ కి తరలించారు. ఈ సంఘటన జరిగినప్పుడు రామ్‌లాల్, కందరి ఇద్దరూ తాగినట్లు తెలిసిందని, వీరిద్దరిని అరెస్టు చేసినట్లు రావత్ తెలిపారు. నేరానికి ఉపయోగించిన పిస్టల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనితో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: