భారతదేశంలో క్రికెట్ కి ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిన విషయమే. ఇండియా టీం ఏదైనా క్రికెట్ మ్యాచ్ ఆడుతుంది అంటే టీవీలకు అతుక్కుపోయి మరి ప్రేక్షకులు మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు. అదే ఐపీఎల్ వస్తే... క్రికెట్ ప్రేక్షకులకు మజా డబుల్  అయిపోతుంది. దేశమంతా క్రికెట్ సందడి నెలకొంటుంది. అప్పుడువరకు  క్రికెట్ చూడని వాళ్ళు కూడా టీవీలకు అతుక్కుపోయి మరి క్రికెట్ను వీక్షిస్తూ ఉంటారు. ఎందుకంటే అప్పటి వరకు దేశం కోసం ఆడిన ఆటగాళ్లందరూ విడిపోయి ప్రత్యర్థులుగా మారిపోతారు. విదేశీ ఆటగాళ్లతో జతకలిసి  ప్రత్యర్థులు గా మారిన భారత ఆటగాళ్లు హోరా హోరీగా పోటీ పడుతూ ఉంటారు. అందుకే క్రికెట్ ప్రేక్షకులను ఐపీఎల్ ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది. 

 

 అయితే ఐపీఎల్లో ఎక్కువ ప్రేక్షకాదరణ ఉన్న జట్లలో  ఒకటి చెన్నై సూపర్ కింగ్స్. భారత మిస్టర్ కూల్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో... చెన్నై సూపర్ కింగ్స్ ఐపిఎల్ సీజన్ లో అదరగొడుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు అన్ని ఐపీఎల్ సీజన్లలో  చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ వరకు చేరుకుంది. ఇక ఏకంగా మూడుసార్లు ట్రోఫీని గెలుచుకుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ధోనీ సారథ్యంలో అద్భుతంగా రాణిస్తూ ఉంటుంది. అయితే ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులందరికీ ఐపీఎల్ మ్యాచ్ ఎంతో ప్రత్యేకం గా మారింది. అందుకు కారణం ధోని... గత సంవత్సరం జరిగిన ప్రపంచకప్ తర్వాత... ధోని అసలు మైదానంలోకి అడుగుపెట్టిన దాఖలాలు లేవు. ప్రపంచ కప్ తర్వాత పూర్తిగా క్రికెట్కు దూరం అయిపోయాడు మహేంద్రసింగ్ ధోని. 

 

 ఇక ఇప్పుడు దాదాపు తొమ్మిది నెలల తర్వాత మరోసారి మైదానంలోకి అడుగు పెట్టి మ్యాచ్ ఆడనున్నాడు. దీంతో అటు ధోని  అభిమానులతోపాటు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు అందరూ ఎంతో ఆతృతగా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. కాగా ఐపీఎల్ 13 ప్రారంభ మ్యాచ్ మార్చి 29న జరగనుండగా తొలి మ్యాచ్లో ముంబై చెన్నై జట్లు పోటీ పడనున్నాయి. కాగా ఈ మ్యాచ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ మరియు ధోనీ ఫ్యాన్స్ అందరూ... సింహం వచ్చేస్తుంది విజిల్ కొట్టేందుకు సిద్ధంగా ఉండండి అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: