టీమ్ ఇండియా డేరింగ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ లో ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిన విషయం. ఓవైపు జట్టుకు సారథిగా జట్టు బాధ్యతలను భుజాలపై వేసుకుని ముందుకు నడిపిస్తూనే ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా మైదానంలో చెలరేగి ఆడుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు విరాట్ కోహ్లీ. ప్రత్యర్థి జట్టు ఏదైనా చిత్తుగా ఓడించేందుకు  తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతూ జట్టును విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. ఇక జట్టులో  కీలక బ్యాట్స్మెన్గా పరుగుల వరద పారిస్తూ... భారీ స్కోర్లను చేస్తూ జట్టుకు  విజయాలను అందిస్తున్నారు విరాట్ కోహ్లీ. ఇక ఎన్నో రికార్డులను తిరగరాస్తూ తన పేరును లికించుకుంటున్నాడు. 

 


 ఇప్పటికే కోహ్లీ ఎన్నో రికార్డులను తిరగరాసి సంచలన రికార్డులను నమోదు చేసిన విషయం తెలిసిందే.   ఎలాంటి ఫార్మాట్లలో అయినా అద్భుత ప్రదర్శన చేస్తూ ప్రస్తుతం వరల్డ్ నెంబర్వన్ బ్యాట్స్మన్గా కొనసాగుతున్నాడు. గత కొన్నేళ్ల నుంచి నెంబర్వన్ స్థానంలో కొనసాగుతున్న విరాట్ కోహ్లీనీ..ఏ ఆటగాడు  వెనక్కి నెట్టలేకపోయాడు . అయితే ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో దూకుడుగా ఆడుతూ పరుగుల వరద పారిస్తూ  జట్టు సారథ్య బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్న విరాట్ కోహ్లీ గురించి ప్రస్తుతం ఓ  వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 


 అది ఏంటంటే టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడేళ్ళ తర్వాత ఒక ఫార్మాట్ గుడ్ బై చెప్పనున్నాడు  అనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పట్లో ఏదైనా ఫార్మాట్  నుండి తప్పుకునే ఆలోచన ఏమైనా ఉందా అని మీడియా అడిగిన ప్రశ్నకి 2023 వరకు అయితే అన్ని ఫార్మాట్లలో కొనసాగుతాను  అంటూ సమాధానం చెప్పడం ఆసక్తికరంగా మారింది. 2023 తర్వాత ఓ ఫార్మాట్ నుంచి తప్పుకోవడం గురుంచి  ఆలోచిస్తా అని  కోహ్లీ సమాధానం చెప్పాడు. దీంతో కోహ్లీ 2023 తర్వాత టెస్టు వన్డే ఫార్మాట్ లో  కొనసాగుతూ టీ20లకు  గుడ్ బై చెప్పనున్నట్లు  ఊహాగానాలు వెలువడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: