భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య నిన్న శుక్రవారం ప్రారంభం అయినా తొలి టెస్ట్ తొలి రోజుకి వరుణుడు అడ్డుపడిన విషయం తెలిసిందే. అయితే అనుకోని రీతిలో టీ బ్రేక్ తర్వాత భారీ వర్షం కురవడంతో మ్యాచ్ ను అర్ధాంతరంగా ఆపేశారు. తొలిరోజు మ్యాచ్ ముగిసినట్టు అంపైర్లు ప్రకటించారు.
అయితే బీసీసీఐ ఇంస్టాగ్రామ్ వేధికగా ఓ విచిత్రమైన ఫోటోను షేర్ చేసింది. అది ఏంటి అంటే? తొలి టెస్ట్ లో భాగంగా టాస్ వేసే సమయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో ఓ విచిత్రమైన స్టెప్ వేసాడు. ఆ స్టెప్ ను ఫోటో తీసిన బిసిసిఐ బీసీసీఐ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది.
ఆ పోస్టులో ఇలా పేర్కొంది.. ఈ పెటుకు మంచి కామెంట్ పెట్టండి.. అందరికంటే మంచి కామెంట్ ఏదైతే ఉంటుంది అది పోస్ట్ చేస్తా అని ఆ పోస్టులో పేర్కొంది. దీంతో అభిమానులు అంత వారి సృజనాత్మకతను అక్కడ కనబరిచారు. అయితే ఈ నేపథ్యంలోనే 'బీసీసీఐ' పోస్టుకు టీమిండియా యువ బ్యాట్స్మన్ ''శ్రేయస్ అయ్యర్'' కూడా హాస్యాస్పదంగా స్పందించాడు.
కోహ్లీ ఫొటోకు అయ్యర్ కామెంట్ చేస్తూ ''విరాట్ కోహ్లీ చేతి వేళ్లు విరిగిపోయాయి'' అంటూ కామెంట్ చేశాడు. దీంతో నెటిజన్లు అంత అతని కామెంట్ కు భారీ లైకులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ కామెంట్ బీసీసీఐకి నచ్చింది ఏమో చూడాలి. చూద్దాం.. బీసీసీఐ ఎవరి కామెంట్ ను పోస్ట్ చేస్తుందో.
View this post on Instagram