కొద్దీ రోజుల క్రితం న్యూజిలాండ్ తో జరిగిన మొదటి  టెస్టు లో చెత్త ప్రదర్శన చేయడంతో  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నెంబర్ వన్ ర్యాంక్ ను కోల్పోవాల్సి వచ్చింది.  అతని తోపాటు టెస్టు స్పెషలిస్ట్ పుజారా , యువ ఫాస్ట్  బౌలర్ బుమ్రా లు కూడా మూల్యం చెల్లించుకున్నారు. ఈటెస్టు కు ముందు వరకు టెస్టు బ్యాట్స్ మెన్  ర్యాంకింగ్స్ లో మొదటి స్థానం లో వున్న కోహ్లీ తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకుల జాబితాలో రెండవ స్థానానికి పడిపోగా 7వ స్థానం లో వున్న పుజారా 9వ స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో 911 పాయింట్ల తో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ స్టీవెన్ స్మిత్ మొదటి స్థానం లో కొనసాగుతుండగా కోహ్లీ 906 పాయింట్ల తో రెండవ స్థానంలో వున్నాడు. వీరితోపాటు విలియమ్సన్ , లబుషెన్ , బాబర్ ఆజామ్ తరువాతి స్థానాల్లో వున్నారు. అయితే టీమిండియా యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మాత్రం 10వ స్థానానికి ఎగబాకాడు. 
 
ఇక టెస్టు బౌలర్ల విషయానికి వస్తే కివీస్ తో మొదటి టెస్టుకు ముందు వరకు 6వ స్థానంలో వున్న బుమ్రా తాజాగా టాప్ 10లో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. మొదటి టెస్టు లో 9వికెట్ల తో రాణించడంతో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ సౌథీ 6వ ర్యాంక్ దక్కించుకున్నాడు. ఈ జాబితాలో ఆసీస్ స్టార్ పేసర్ కమ్మిన్స్ మొదటి స్థానం లో ఉండగా నీల్ వాగ్నెర్ రెండో స్థానం లో వున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: