మార్చి 29 న నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ - 2020 సీజన్ కోసం ఇటీవల విదులచేసిన షెడ్యూల్ లో ఎలాంటి మార్పులు చేయట్లేదని బీసీసీఐ అధ్యక్షుడు, భారత జట్టు మాజీ సారధి సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో మార్చి 29 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ షెడ్యూల్ లో మార్పులు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, బీసీసీఐ చీఫ్ గంగూలీ మాత్రం ఆ వార్తల్ని తోసి పుచ్చారు. IPL టోర్నీలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
మొదటి రోజు వాంఖడే వేదికగా మార్చి 29న డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ -13 కోసం భారత్ కి వచ్చేందుకు ఇప్పటికే కొన్ని దేశాలకి చెందిన క్రికెటర్లు సిద్దమవ్వగా.. మరికొందరు భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తిపై ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటూ వేచి చూసే ధోరణిలో ఆటగాళ్లు కనిపిస్తున్నారు. కాకపోతే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే టోర్నీ జరుగుతుందని గంగూలీ తాజాగా చెప్పడంతో అన్ని రూమర్స్ కి చెక్ పెట్టినట్లైంది.