భారత్ తో జరుగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం 5రోజుల క్రితమే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. అయితే తాజాగా ఈ సిరీస్ కోసం మరొకరిని జట్టులోకి ఎంపిక చేసింది. అతనెవరో కాదో యువ ఓపెనర్ జన్నేమన్ మలాన్. ఆస్ట్రేలియా తో జరిగిన వన్డే సిరీస్ తో అంతర్జాతీయ వన్డే క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన మలాన్ ఆసిరీస్ లో అరంగేట్రం మ్యాచ్ లో డకౌట్ కాగ రెండో మ్యాచ్ లో సెంచరీ చేసి జట్టును గెలిపించాడు.. నిన్న జరిగిన మూడో వన్డే లో 23పరుగులు చేశాడు అయితే మలాన్ ప్రదర్శన తో సంతృప్తి చెందిన బోర్డు చివరి నిమిషం లో అతన్ని టీమిండియా పర్యటనకు ఎంపిక చేసింది.

 
ఇక ఆదివారం సౌతాఫ్రికా జట్టు ,దుబాయ్ మీదుగా ఢిల్లీ కి చేరుకోనుంది అక్కడి నుండి మ్యాచ్ జరిగే ముందు రోజు ధర్మశాల కు చేరుకోనుంది. ఇరు జట్ల మధ్య ఈనెల 12న  మొదటి వన్డే జరుగనుంది. నేడో లేదా రేపో ఈ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించనుంది బీసీసీఐ. 
 
సౌతాఫ్రికా జట్టు :  డికాక్ (కెప్టెన్ ,కీపర్), బావుమా ,వాన్ డెర్ దుస్సేన్ ,డేవిడ్ మిల్లర్ ,డుప్లెసిస్ ,జాన్ జాన్ స్మట్స్ ,ఫెహ్లుక్వయో ,లుతో సిఫామ్లా ,లిండే, కైల్ వెర్రేయన్నే , బ్యురేన్ హెన్డ్రిక్స్, ఎంగిడి, నోర్జే, కేశవ్ మహారాజ్, క్లాసెన్ , జన్నేమన్ మలాన్

మరింత సమాచారం తెలుసుకోండి: