నేడు జరుగుతున్న ఆస్ట్రేలియా, భారత మహిళల జట్ల మధ్య జరుగుతున్న టీ - 20 వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ని ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ వేదికగా జరుగుతుంది. బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా మహిళల జట్టు బెత్ మోని, అలైస్స హీలీ లతో బ్యాటింగ్ ఇన్నింగ్స్ ని  మొదలు పెట్టారు. 

 

IHG

అయితే వీరిద్దరూ బౌలర్లు ఎవరు అని లేకుండా ఆకాశమే హద్దుగా పరుగుల బోర్డును పరుగెత్తిస్తున్నారు. ప్రస్తుతానికి పది ఓవర్ల ముగిసే సరికి ఒక్క వికెట్ నష్ట  పోకుండా  91 /0 తో ఆస్ట్రేలియా టీం పరుగులను సాధించారు. ఇందులో బెత్ మోని 37 పరుగులతో, అలైస్స హీలీ 64 పరుగులతో అజేయంగా ఆడుతున్నారు. భారత మహిళల జట్టులో DB శర్మ, ఎస్ పాండే, గాయక్వాడ్, పూనమ్ యాదవ్ ఇలా అందరిని ఎంటువంటి కంట్రోల్ లేకుండా పరుగులు ఇచ్చేసారు.

 

 


ఇలా ఆడితే కనుక ఆస్ట్రేలియా జట్టు భారత్ ముందు పెద్ద టార్గెట్ ఇవ్వడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: