సెలక్షన్ కమిటీ నూతన  ఛైర్మెన్ సునీల్ జోషి నేతృత్వం లో  సౌతాఫ్రికా తో జరుగనున్న వన్డే సిరీస్ కు ఆదివారం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ జాబితాలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ కేదార్ జాదవ్ ,యువ ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ లకు చోటు లభించలేదు. ఇటీవల టీ 20 ల్లో చోటు కోల్పోయిన కేదార్ తాజాగా వన్డే ల్లో కూడా ఛాన్స్ దక్కించుకోలేకపోయాడు దాంతో కేదార్ జాదవ్ ఇప్పట్లో మళ్ళీ జట్టులోకి రావడం కష్టమే అనే వాదనలు వినిపిస్తున్నాయి అయితే  శార్దూల్ కు మాత్రం మరో అవకాశం ఇస్తే బాగుండని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఇక ఈ సిరీస్ తో ఇటీవల గాయాల భారీన పడి పలు సిరీస్ లకు దూరమైన శిఖర్ ధావన్ , హార్దిక్ పాండ్య , భువనేశ్వర్ కుమార్ రీ ఎంట్రీ ఇవ్వనుండగా షమి కి విశ్రాంతినిచ్చారు. అలాగే స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయం నుండి పూర్తిగా కోలుకోకపోవడం తో అతని స్థానం లో శుభమాన్ గిల్ ను ఎంపికచేశారు. ఇక రిజర్వడ్ కీపర్ గా రిషబ్ పంత్ మరోసారి  చోటు దక్కించుకున్నాడు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇరు జట్ల మధ్య మొదటి మ్యాచ్ ధర్మశాల లో ఈనెల 12న జరుగనుంది. 
 
భారత జట్టు : 
విరాట్ కోహ్లీ (కెప్టెన్),శిఖర్ ధావన్ ,పృథ్వీ షా ,కేఎల్ రాహుల్ ,రిషబ్ పంత్ ,జడేజా,శ్రేయస్ అయ్యర్ ,హార్దిక్ పాండ్య ,మనీష్ పాండే ,కుల్దీప్ , చాహల్, బుమ్రా ,సైని ,భువనేశ్వర్ కుమార్, గిల్ 

మరింత సమాచారం తెలుసుకోండి: