ప్రపంచ క్రికెట్ దేవుడిగా కొలిచే భారత బ్యాట్స్ మన్, 'లిటిల్ మాస్టర్' సచిన్ టెండూల్కర్ మరియు ప్రపంచ క్రికెట్ లోని మేటీ ఓపెన్నర్లలో ఒకరైన నా విధ్వంసకర 'డాషింగ్ ఓపెనర్' వీరేందర్ సెహ్వాగ్ మళ్లీ కలిసి ఓపెనింగ్ చేయనున్నారు. రోడ్ సేఫ్టీ వరల్డ్ టి20 సిరీస్ లో ప్రతీ దేశం నుండి రిటైర్ అయిపోయిన ఆటగాళ్లందరూ కలిసి ఆడుతుండగా ఇందులో సచిన్, సెహ్వాగ్ లతో పాటు లారా, యువరాజ్ వంటి ఎంతోమంది దిగ్గజ ఆటగాళ్ళు కూడా ఆడుతున్నారు.

 

IHG

 

ప్రజలకు రోడ్డు సేఫ్టీ పైన అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన టి20 సిరీస్ లో మొదటి మ్యాచ్లో భారత్ వెస్టిండీస్ లెజెండ్ పైన ఘన విజయాన్ని సాధించింది. వెస్టిండీస్ టీం లో చంద్రపాల్, లారా, టీనో బెస్ట్ వంటి ఆటగాళ్లతో సచిన్, సెహ్వాగ్, జహీర్ ఖాన్, కైఫ్, యువరాజ్ వంటి ఆటగాళ్లు పోటీపడగా.... సచిన్ మొదటి సెహ్వాగ్ మొదటి వికెట్ కు 83 పరుగుల భాగస్వామ్యం ఇచ్చారు. అసలు వారిద్దరూ పాత రోజులను గుర్తుకు వచ్చేలా చూడముచ్చట తరహాలో షాట్లు ఆడుతుంటే రెచ్చిపోవడం భారత అభిమానుల వంతు అయింది.

 

IHG

 

ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ అయితే తన క్లాస్ బ్యాటింగ్ తో స్టేడియంలోని అభిమానులను ఉర్రూతలూగించాడు. మ్యాచ్లో సచిన్ 36 పరుగులు చేయగా సెహ్వాగ్ 74 పరుగుల తో చివరి వరకు నాటౌట్ గా నిలిచాడు. ఇక నేడు జరుగుతున్న మ్యాచ్ లో భారత్ లెజెండ్స్ తో శ్రీలంక లెజెండ్స్ పోటీపడుతుండగా అందులో దిల్షాన్, ఆటపట్టు లతో పాటుగా లెజెండరీ బౌలర్లు ముత్తయ్య మురళీధరన్, చమిందా వాస్ కూడా ఉన్నారు. ఎంతైనా గత రెండు దశాబ్దాలు ప్రపంచ క్రికెట్ అభిమానులను మంత్ర ముగ్ధులను చేసిన వారు మరలా స్టేడియం లోనికి అడుగుపెడితే అది కన్నుల పండుగ కాక మరేమిటి...?

 

IHG

 

మ్యాచ్ జియో టీవీ, వూట్ యాప్, డిడి స్పోర్ట్స్ మరియు యూట్యూబ్ లో కూడా రోజు రాత్రి 7 గంటల నుండి ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. కాబట్టి మిస్ కాకండే.

మరింత సమాచారం తెలుసుకోండి: