టీం ఇండియా ఆటగాళ్ళ ప్రదర్శన విషయంలో న్యూజిలాండ్ సీరీస్ తర్వాత అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి స్వదేశంలో పులులు విదేశాల్లో పిల్లులు అనే మాటను మూట గట్టుకున్నారు మన వాళ్ళు. న్యూజిలాండ్ పర్యటనలో టీం ఇండియా ఘోరంగా విఫలమైంది. దీనితో వాళ్ళ ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే విదేశాలకు భార్యలను, గర్ల్ ఫ్రెండ్స్ ని తీసుకుని వెళ్ళవద్దని చెప్పినా ఒక ఆటగాడు వినడం లేదని సమాచారం. 

 

ఆ ఆటగాడు ఇటీవల ఘోరంగా విఫలమయ్యాడు. టి20 సీరీస్ లో అతని ప్రదర్శన ఆకట్టుకోలేదు. ఆ తర్వాత టెస్ట్ వన్డే సీరీస్ కి దూరమయ్యాడు. అయితే అతను వద్దని చెప్తున్నా సరే భార్యతోనే వెళ్తున్నాడు అని బోర్డు కూడా అతని విషయంలో ఆగ్రహంగా ఉందని సమాచారం. ప్రస్తుతం అతనికి క్లాస్ కూడా బోర్డ్ పెద్దలు పీకినట్టు సమాచారం. ఐపియల్ తర్వాత కీలక విదేశీ పర్యటనలు ఉన్నాయి. 

 

ఆ పర్యటనల విషయంలో బోర్డ్ సీరియస్ గా ఉంది. విదేశీ పర్యటనలకు ఎలాంటి పరిస్థితుల్లో ను ఇక భార్యలను గర్ల్ ఫ్రెండ్స్ ని అనుమతించవద్దు అని బీసీసిఐ అధ్యక్షుడు గంగూలీ కూడా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇతరులతో కూడా చర్చించి దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దీని గురించి చర్చలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: