భారత టెన్నిస్ లో చెప్పుకోతగ్గ పేర్లలో ఒక్కరైనా సానియా మీర్జాకు సంబందించిన ఒక ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. సానియానే స్వయంగా పోస్ట్ చేసిన ఆ ఫొటోలో, ఒక చేతిలో తన కొడుకు ఇజాన్ ను, మరో చేతిలో టెన్నిస్ రాకెట్ ను పట్టుకుని టెన్నిస్ కోర్టు నుంచి బయటకు వారిద్దరూ వస్తున్నారు. ఫెడ్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ సందర్భంగా సానియా తన కొడుకుని కూడా అక్కడకి తీసుకెళ్లారు. ఆ ఫొటో ఇప్పుడు తాజాగా సానియా తన ఇన్స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అయితే అందుకు గాను ఆమె "ఈ ఫొటోలోనే నా జీవితం, నాకు మరో మార్గం లేదు. నా పని నేను ఉత్తమంగా చేయడానికి ఇజాన్ నన్ను ఎక్కువగా ప్రోత్సహిస్తాడు" అనే క్యాప్షన్ ని సానియా మీర్జా అందులో రాసుకొచ్చారు.
ఇజానే తనకు అన్ని అని సానియా అందులో చెప్పుకొచ్చారు. దీనితో పాటుగా తొలిసారి ప్లే ఆఫ్ లో ఆడడం ఎంతో సంతోషంగా ఉందని కూడా సానియా అక్కడ రాసుకొచ్చారు. నిజానికి ప్రతి అమ్మలాగే సానియా కూడా తల్లిగా తన కొడుకు సంరక్షణతో పాటు కెరీర్ ను కూడా బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు. అయితే మార్చి 8న ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ 2-1 తో విజయం సాధించి తొలిసారి వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ దశకు భారత్ అర్హత సాధించింది.
అక్కడ జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో తలపడిన ఈ టోర్నీలో సానియా, రుతుజా, అంకిత, రియా భాటియా, సౌజన్య భవి శెట్టిలతో కూడిన భారత జట్టు నాలుగు మ్యాచ్ ల్లో గెలుపొందింది. ఏప్రిల్ మాసంలో జరగనున్న ప్లే ఆఫ్ లో లాత్వియా లేదా నెదర్లాండ్స్ జట్టులతో ఏదో ఒక్క టీంతో భారత్ ప్లే ఆఫ్ మ్యాచ్ లు ఆడుతుంది.