ఒకవైపు కరోనా ప్రపంచం మొత్తాన్ని వణికిస్తూ ఎవరినీ వారి పనిచేసుకోనీకుండా అడ్డు పడుతుంటే పాకిస్తాన్ మాత్రం ముందు జాగ్రత్తగా కనీస చర్యలు తీసుకోలేక ఇప్పుడు విపరీతంగా నష్టపోయింది. కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించడం వల్ల దక్షిణాఫ్రికాతో జరిగే వలసిన సిరీస్ ను బిసిసిఐ నిలిపివేసింది. తర్వాత నెల ఆఖరి లో జరిగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను కూడా ఏప్రిల్ 15 తేదీ వరకు వాయిదా వేసింది. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ సిరీస్ తో పాటు మరియు అన్ని దేశాలు క్రికెట్ ఫుట్ బాల్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్క ఈవెంట్ ను నిలిపివేస్తే పాకిస్తాన్ మాత్రం వారి దేశంలో జరిగే టి20 క్రికెట్ లీగ్ పాకిస్తాన్ సూపర్ లీగ్ అలాగే కొనసాగించారు.

 

పాకిస్తాన్ సూపర్ లీగ్ కరోన్ అంటే ఎటువంటి భయం లేకుండా యదాతధంగా జరగగా ఇదేమిటని ప్రపంచ ప్రజలంతా ఆశ్చర్యపోయారు. చివరికి రోజు జరగాల్సిన నాకౌట్ మ్యాచ్, రెండో సెమీ ఫైనల్ అర్ధాంతరంగా నిలిపివేసి ప్రస్తుతానికి లీగ్ ను రద్దు చేస్తున్నట్లు తెలపడంతో అసలు ఇది ఏంటి అని అంతా తల గోక్కున్నారు. ఇన్ని రోజులు ఎవరి మాటలు లెక్కచేయకుండా కొనసాగించిన క్రికెట్ లీగ్ ఉన్నఫలంగా పాకిస్తాన్ ఎందుకు నిలిపివేసింది అంటే ఒక్కసారిగా నిన్న ఒక్కరోజే వారి దేశంలో దాదాపు 130 మంది కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఎంతోమంది పేరున్న ఇంటర్నేషనల్ ఆటగాళ్ళు వచ్చి ఆడుతుంటారు వారి ఆటను చూసేందుకు విదేశీ అభిమానులు పాకిస్తాన్ కు తరలి వచ్చారు.

 

 

ఇంకేముంది మైదానంలో లో ఆటగాళ్ళు అటు ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోతుంటే స్టాండ్స్ లో ప్రేక్షకులు ఉత్సాహంతో ఊగిపోతూ ఒకరికొకరు కరోనా వైరస్ అంటించుకుంటూ ఉండిపోయారు. దీంతో పాకిస్థాన్ కు చివరికి బుద్ధి వచ్చి లీగ్ ముగిసేందుకు కేవలం మూడు మ్యాచ్ లు మిగిలి ఉండగా వెంటనే దానిని ఆపివేసింది. ఇప్పటికే కరోనా లక్షణాలు ఉన్న ఒక విదేశీ ఆటగాడిని ముందురోజే అతని దేశానికి పంపించేసినట్లు కూడా సమాచారం. అదే కనుక నిజమైతే అతనితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న పాక్ ఆటగాళ్ళకు మరియు మిగిలిన వాళ్లకు కూడా ముప్పు పొంచి ఉంది చివరికి ఏం జరిగినా పాకిస్తాన్ బాధ్యత.

మరింత సమాచారం తెలుసుకోండి: