ప్రస్తుతం కరోనా వైరస్ తరుణంలో అన్ని రంగాలు కూడా మూత పడిన విషయం అందరికి తెలిసిన విషయమే. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ, క్రికెట్ ఆటగాళ్లు అన్ని రంగాల ప్రముఖులు అందరూ కూడా ఇంట్లోనే ఉంటూ వారి కుటుంబ సభ్యులతో హాయిగా జీవనం కొనసాగిస్తున్నారు. ఇంకా మరి కొందరు ఆటగాళ్లు అయితే ఇంటి డ్రాయింగ్ రూమ్ లో ఆర్చరీ వర్చువల్ షూటింగ్ రేంజిలో వారి సామర్థ్యాన్ని చూపుతూ, వంటలు చేస్తూ సమయాన్ని గడుపుతున్నారు.

 


ప్రస్తుతం భారత మహిళా క్రికెట్ సభ్యులు కూడా ఇదే తరుణంలోనే వారి సమయాన్ని గడుపుతున్నారని చెప్పాలి. మహిళా జట్టు సభ్యులందరూ కలిసి ఆన్లైన్లో లూడో గేమ్ ఆడుతున్నారు. ఎప్పుడూ బ్యాట్, బంతి తో ఆట ఆడే వారు ప్రస్తుతం పాచికలు వారికి పరమపూజ్యంగా మారిపోయాయి అంటే నమ్మండి. ఇక మహిళా జట్టు ఓపెనర్ స్మృతి మంధాన ఈ విషయమే అభిమానులందరికీ తెలియజేయడం జరిగింది.

 


మైదానంలో ఎప్పుడు అందరితో కలిసి ఉండి ఆట ఆడే తరుణంలోనే ఇప్పుడు కూడా అదే బంధం కొనసాగుతున్నట్లు ఉందని ఓపెనర్ తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మా ట్రైనర్ మాకు అందరకు సపరేట్ గా పంపించిన ట్రైనింగ్ షెడ్యూల్ ని అనుసరిస్తూ సభ్యులు అందరూ కూడా ఫిట్నెస్ ను కాపాడుతూనే ప్రయత్నాలు కూడా చేస్తున్నామని ఓపెనర్ స్మృతి తెలియజేయడం జరిగింది. ఇక నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం వారానికి రెండు మూడు సినిమాలు చూస్తున్నానని తెలిపింది. దీనితో పాటు నాకు ఇష్టమైన పని నిద్ర.. రోజుకు నేను పది గంటలు పడుకుంటున్నాను. ఇలా ప్రశాంతంగా నిద్ర పోవడం రోజంతా హాయిగా సమయాన్ని గడుపుతున్నానని ఓపెనర్ స్మృతి తెలియజేయడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: