ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ దెబ్బతో విలవిల్లాడుతున్న పరిస్థితి నెలకొంది. ఇక భారత్ లో ఈ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని చెప్పుకోవచ్చు. దీనికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ ముందు జాగ్రత్తతో దేశం మొత్తం లాక్ డౌన్ ని విధించడమే. అయితే ఈ లాక్ డౌన్ వల్ల ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో వివిధ రకాల ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ముఖ్యంగా ఆహారం దొరక్క ఇబ్బంది పడుతుంటే కొందరు మద్యం దొరకడం లేదని గొడవ చేస్తున్నారు. అలాగే ఇంకో ఇబ్బందికర సమస్య ఏమిటంటే హెయిర్ కట్ సమస్య. నిజానికి ఈ సమస్య చిన్నది అయిన ఈ నేపథ్యంలో సెలూన్లు మూసివేయడంతో సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఈ సమస్యతో.
అయితే తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ఇదే సమస్య ఎదురైంది అంట. కానీ సెలవులు మూసేయడంతో హెయిర్ కట్ ఎలా చేయించుకోవాలని అనుకోగా తానే సొంతంగా కటింగ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడట. అయితే ఈ విషయాన్ని సచిన్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. అందులో సచిన్ తన కొత్త హెయిర్ కటింగ్ చేసుకుంటున్న ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. స్క్వేర్ కట్స్ ఆడటం నుంచి నా సొంత హెయిర్ కట్స్ చేసుకోవడం వంటి కొత్త పనులు చేయడం ఇప్పుడు మిమ్మల్ని ఆనందిస్తాను అని, నా న్యూ లుక్ ఎలా ఉంది అని అభిమానులను సచిన్ అడగడం జరిగింది. దీనితో అవి కాస్త ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
2013 సంవత్సరంలో తన అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఆయన తన వంద సెంచరీల రికార్డుతో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతే కాకుండా భారత క్రికెట్ అభిమానులలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నాడు. క్రికెట్ దేవుడిగా ఆయన్ని మనం పిలవడం తెలిసిన సంగతే. ప్రస్తుతం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తనవంతు సాయంగా కేంద్రానికి 50 లక్షల విరాళాన్ని అందజేశాడు.