ప్రస్తుతం కరోనా వైరస్ పుణ్యమా అని ఎవరికి వారు వారి ఇళ్లలో ఉండిపోయారు. అలాగే ఆటగాళ్ళు కూడా వారి ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక అసలు విషయానికి వస్తే మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఇంట్లోనే తన ఫ్యామిలీతో పూర్తి సమయాన్ని గడుపుతున్నాడు. రాంచిలో ఉన్న తన ఫాం హౌస్లో ఇటీవల లాన్ ని శుభ్రపరుస్తూ కనిపించిన ధోని, తాజాగా ఇప్పుడు కూతురు జీవా పై చక్కర్లు కొడుతున్న వీడియోని ధోనీ భార్య సాక్షి ధోని అభిమానులతో పంచుకుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Cutest Video On Internet Today !! 🤩💕

A post shared by ms dhoni Fans Club (@dhoni.bhakt) on


ఆ వీడియో కి " ఇక్కడ ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు... వారిలో ఒకరు పెద్ద పిల్లోడు... మరొకరు చిన్న పిల్ల"  అని సాక్షి పోస్ట్ చేసింది. అయితే 2019 ప్రపంచ కప్ తర్వాత టీమిండియాకి దూరంగా ఉన్న ధోని ఐపీఎల్ 2020 సీజన్లో రాణించి మళ్లీ టీం లోకి అడుగుపెడతాడనే అందరూ భావించారు. కాకపోతే కరోనా వైరస్ పుణ్యమా అని ఐపీఎల్ 2020 సీజన్ వాయిదా పడింది. దీనితో ప్రస్తుతం తన కెరీర్ ప్రశ్నార్థకంలో ఉండగా ఆస్ట్రేలియాలో జరగబోతున్న టి20 వరల్డ్ కప్ లో ఆడిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాలని ధోని ఆశిస్తున్నాడు.

 


2005 సంవత్సరంలో అడుగుపెట్టిన ధోని కేవలం రెండేళ్ల వ్యవధిలోనే కెప్టెన్ గా బాధ్యతలు అందుకని అందరినోట ఔరా అనిపించుకున్నాడు. ఒక దశాబ్ద కాలం పాటు తాను తిరుగులేని నాయకుడిగా టీమిండియాను మొదటి స్థానంలో నిలబెట్టాడు. ఈ క్రమంలోనే ఐసిసి నిర్వహించే అన్ని కప్పులను ( టీ - 20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ) లను అను ఇండియాకు అందించాడు. ఇంతవరకూ ఈ మూడు ట్రోఫీలను గెలిచిన ఏకైక కెప్టెన్ గా ధోనీ తన పేరును రికార్డ్ లో ఎక్కించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: