టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మళ్లీ టీమిండియాకి ఆడాలని లేదని భారత్ మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన అభిప్రాయపడ్డాడు. గత ఏడాదిలో జరిగిన వన్డే ప్రపంచకప్ ‌లో ఆఖరిగా టీమిండియా తరుపున మ్యాచ్ ‌లు ఆడిన మహి, ఆ తర్వాత పూర్తిగా కొద్ది నెలలుగా క్రికెట్ ‌కి దూరంగా ఉంటున్నాడు. అయితే తాజాగా టీమిండియా క్రికెటర్లకి bcci ఏటా ఇచ్చే సెంట్రల్ కాంట్రాక్ట్ ‌ని కూడా చేజారుకోవలిసి వచ్చింది మాజీ కెప్టెన్ మహి.. 

 


ఇక తన ఫామ్ నిరూపించుకుని మళ్లీ భారత్ జట్టులో రీఎంట్రీ కోసమని IPL - 2020 సీజన్‌ ని ఉపయోగించుకోవాలని యోచించాడు. కాకపోతే..., కరోనా వైరస్ దెబ్బతో IPL నిరవధికంగా వాయిదా పడటంతో ధోనీ అంతర్జాతీయ కెరీర్ ను ఇప్పుడు ప్రశ్నార్థకంలో పడింది అని చెప్పవచ్చు. ఇక ఆస్ట్రేలియా వేదికగా ఈ సంవత్సరం అక్టోబరు నెలలో టీ - 20 వరల్డ్ ‌కప్ ఆడనుండగా.. ఈ టోర్నీలో ధోనీ ఆడతాడని చాలా మంది భారత మాజీ క్రికెటర్లు, అతని అభిమానులు అనుకుంటున్నారు. అయితే, స్వతహాగా ధోనీకే మళ్లీ టీమిండియా తరుపున ఆడాలనే ఇంట్రస్ట్ తనకు లేదని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ‌లోని అతని సహచరుడు హర్భజన్ సింగ్ తాజాగా తెలిపాడు. COVID - 19 కారణంగా టీ - 20 వరల్డ్‌ కప్ ‌ని కూడా వాయిదా వేసే దిశగా ఐసీసీ ఆలోచిస్తున్న తెలిసిన విషయం తెలిసిందే.

 

 
అయితే మహేంద్రసింగ్ ధోనీ IPL ‌లో ఆడాలని 100% దృఢ నిశ్చయంతో ఉన్నాడని, కాకపోతే... ఇక్కడ చాలా మందికి తెలియాల్సిన ఏంటంటే..? టీమిండియా జట్టుకి మళ్లీ ఆడాలని ధోనీ ఆశిస్తున్నాడా, లేదా ...? అన్నది నా అంచనా ప్రకారం.. టీమిండియాకి ఆడాలనే ఇంట్రస్ట్ ప్రస్తుతం అతనికి లేదు అని తెలిపాడు. ఇది ఎందుకంటే దేశం తరుపున అతను ఇప్పటికే చాలా సంవత్సరాలు మ్యాచ్‌ లు కూడా ఆడాడు. అయితే చివరికి మళ్లీ టీమిండియా జెర్సీ ధరించి ఆడాలని అతనికి లేదు అని, 2019 వన్డే ప్రపంచకప్ ‌లోనే చివరి అంతర్జాతీయ మ్యాచ్ ‌ని పూర్తి చేసానని అతను భావిస్తున్నాడు. అలాగే ఆ విషయాన్ని చాలా మంది నాకు చెప్పారని హర్భజన్ సింగ్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: