ఇండియన్ క్రికెట్ లో మూడు డబుల్ సెంచరీలతో తన కంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆటగాడు రోహిత్ శర్మ. వన్డేల్లో ఈ రికార్డ్ ఎప్పటికి పదిలంగానే ఉంటుంది అనేది వాస్తవం. ఈ రికార్డ్ ని ఇప్పట్లో ఎవరూ సాధించే అవకాశం లేదు. మూడు ఫార్మాత్స్ లో బెస్ట్ ఆటగాడు ఎవరు అయినా ఉన్నారు అంటే రోహిత్ శర్మ.ఈ తరానికి మాత్రం. కోహ్లి తర్వాత అంత నిలకడ ఉన్న ఆటగాడు ఎవరైనా జట్టులో ఉన్నారు అంటే అది కచ్చితంగా రోహిత్ అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో మోడరన్ డే గ్రేట్స్ లో ఒకరు గా పేరు తెచ్చుకున్నాడు. 

 

ఇది పక్కన పెడితే టీం ఇండియా లో అతనికి అవమానాలు జరిగాయి అనేది వాస్తవం. రోహిత్ ని కోహ్లీ అండ్ టీం అవమానించింది అనే ప్రచారం కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. దానికి ప్రధాన కారణం కోహ్లి కి ధీటైన శక్తిగా జట్టులో రోహిత్ ఎదగడమే అని అంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పుడు టీం ఇండియా అంటే రోహిత, కోహ్లి అనే విషయం చాలా మంది చెప్తూ ఉంటారు. ప్రస్తుతం కోహ్లీ ని ఎదుర్కొనే శక్తి రికార్డుల పరంగా చూస్తే రోహిత్ కే ఉంది అనేది చాలా మంది చెప్పే మాట. 

 

ఇదే రోహిత్ కి ఇబ్బంది గా మారింది అని అంటున్నారు పలువురు. రోహిత్ ని జట్టులో అవమానించారు అని అంటున్నారు. ముఖ్యంగా టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బూమ్రా అతన్ని అవమానిస్తున్నాడని పలువురు అంటున్నారు. కనీసం అతని సలహాలను కూడా బూమ్రా తీసుకోవడం లేదని అతను కూడా కెప్టెన్ అయినా సరే బూమ్రా లెక్క లేకుండా వ్యవహరిస్తున్నాడు అనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి కారణం కోహ్లీ అనే అంటున్నారు  జట్టులో కొందరు ఆటగాళ్ళు.

మరింత సమాచారం తెలుసుకోండి: