ప్రపంచ క్రికెట్లో మహేంద్రసింగ్ ధోని కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అనే విషయం తెలిసింది. అయితే ధోని ఫ్యామిలీ విషయంలో ఏం జరిగినా ఇట్టే అభిమానులకు తెలిసిపోతుంది . ఎందుకంటే అటు మహేంద్ర సింగ్ ధోనీతో పాటు ధోని భార్య సాక్షి, కూతురు జీవా కి కూడా సోషల్ మీడియాలో అకౌంట్లు ఉన్నాయి. అందుకే తన ఫ్యామిలీలో ఏ చిన్న విషయం జరిగినా క్షణాల్లో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ ఉంటుంది. ప్రస్తుతం ధోని ఫ్యామిలీకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఈ వీడియోని పోస్ట్ చేసింది మహేంద్రసింగ్ ధోని కూతురు జీవ. తన తండ్రి తో సరదాగా గడిపిన వీడియోని జీవ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేసింది. ప్రస్తుతం ధోని జార్ఖండ్లోని రాంచీలో తన ఫాంహౌస్లో కూతురితో కలిసి సరదాగా ఆడుకుంటున్నట్టు ఈ వీడియోలో కనిపించాడు. అయితే మైదానంలో ఎప్పుడు సరికొత్త లుక్కుతో హాండ్సమ్ గా కనిపించే మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం మాసిన గడ్డంతో కనిపించాడు. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ధోని మామూలుగానే సరి కొత్త స్టైల్స్ ని వాడుతూ ఎప్పుడు మైదానంలో కొత్తగా కనిపిస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే.
ఇక తాజాగా మాసిన గడ్డంతో ధోనిని చూసిన అభిమానులు అందరూ సరికొత్తగా ఉంది అంటూ మురిసిపోతున్నారు. అయితే ధోని ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మళ్లీ ఆడి అదరకొట్టాలని అభిమానులందరూ కోరుకుంటున్నారు. అయితే ధోని ఇదివరకు చాలా గెటప్లలో కనిపించినప్పటికీ గడ్డంతో మాత్రం మొదటి సారి కనిపించాడు. అయితే ఈ మాసిన గడ్డంతో రఫ్ లుక్ ని ధోని ఎప్పటికీ కొనసాగిస్తాడా లేదా... మరో లుక్ ట్రై చేస్తాడా అన్నది అభిమానులకు తెలియని ప్రశ్న. కాగా ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో క్రీడలు నిలిపివేయబడినవి.ఈ నేపథ్యంలో ఆటగాళ్ళందరూ ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే.