ప్రస్తుత టీమిండియాకు అన్ని ఫార్మెట్స్ కు కెప్టెన్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఆటతీరు గురించి కూడా తాజాగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ మాట్లాడాడు. పీటర్సన్ తో జింబాబ్వే మాజీ ప్లేయర్ ఎంబాగ్వా నిర్వహించిన ఒక షోలో మాటాడాడు. ఈ కార్యక్రమంలో భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, కోహ్లీల ఆటతీరును పీటర్సన్ పొల్చాడు. ఇక అందులో లక్ష్య ఛేదన విషయంలో కోహ్లీ గొప్పగా ఆడతాడని, అతని వన్డే సెంచరీలన్నీ దాదాపుగా టార్గెట్ ను చేధించే సమయంలోనే చేసినని అని గుర్తు చేశాడు. అంతేకాకుండా ఎంతో ఒత్తిడి నెలకొనే ఛేదనలో కోహ్లీ తనదైన శైలిలో అద్భుతంగా ఆడతాడని పీటర్సన్ తన అభిప్రాయం తెలిపాడు.
ఇక మరోవైపు 3 ఫార్మాట్లలో కోహ్లీ సగటు 50 కి పైగా కొనసాగుతుంది. అయితే నేను వ్యక్తిగత రికార్డుల కంటే కూడా, జట్టు విజయాలు సాధించిన ఇన్నింగ్స్ లకే పెద్దపీట వేస్తానని ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు పీటర్సన్ తెలిపాడు. ఇకపోతే " మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ " అవార్డులు లాంటివి చాలా ప్రొత్సాహాన్నిస్తాయని, జట్లను గెలుపొందినప్పుడు ఈ అవార్డును అందుకోవడం చాలా బాగుంటుందని తాను వ్యాఖ్యానించాడు. ఇకపోతే ఈ విషయంలో కోహ్లీ ఎంతో మెరుగని, అతని సాధించిన రికార్డులు నమ్మశక్యం కావని పీటర్సన్ తెలిపాడు.
ఇక సమకాలీన క్రికెట్లో కోహ్లీతో పోటీపడుతున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ను పీటర్సన్ ఎందుకో తేలికగా తీసుకున్నాడు. దీనికి కారణం ఆటతీరులో కోహ్లీ దరిదాపుల్లోకి కూడా స్మిత్ రాడని తాను అభిప్రాయపడ్డాడు. ఇందులో అత్యంత స్థిరమైన ఆటతీరుతో ఇండియాకు విజయాలను కోహ్లీ సాగిస్తున్నాడని ఆయన చెప్పాడు. ఇక కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కార్యకలాపాలు వాయిదా పడటంతో ఆటగాళ్లంతా ఇంటిపట్టునే ఉంటున్న సంగతి అందరికి తెలిసిందే. ఇకపోతే కొన్ని క్రికెట్ బోర్డులు తిరిగి మ్యాచ్ లను మొదలు పెట్టేందుకు సన్నహాలు చేస్తున్నాయి.