కరోనా పుణ్యమాని ప్రపంచం మొత్తం క్రీడా రంగం పూర్తిగా మూతపడిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఆటగాళ్ళందరూ ఎవరి ఇళ్లలో వారు ఉంటూ సమయాన్ని వారి కుటుంబంతో హ్యాపీ గా గడిపేస్తున్నారు. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆన్లైన్ లోకి వచ్చి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అంతేకాక అభిమానులు అడిగిన ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానాలు ఇస్తున్నారు.
ఇకపోతే గత సంవత్సరం జరిగిన వరల్డ్ కప్ తర్వాత గ్రౌండ్లో అడుగుపెట్టని మహేంద్రసింగ్ ధోని తాజాగా తన ఇంట్లోనే తోటలో ట్రాక్టర్ నడుపుతూ కనిపించాడు. అప్పుడప్పుడు ధోనీ భార్య సాక్షి ధోని, ధోని కూతురు కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది. ఖాళీ సమయాల్లో ధోనీ ఏం చేస్తున్నాడనేది ఆ వీడియోలో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ధోని పబ్జి గేమ్ ను ఎక్కువగా ఆడుతున్నట్లు ఇటీవల సాక్షి చెప్పకనే చెప్పింది.
ఇకపోతే తాజాగా ధోని ట్రాక్టర్ నడిపిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరపరచిన మౌనరాగం అనే తమిళ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను జత చేసి విడుదల చేసింది. మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.
#Thala dhoni meets raja Sir in his newest beast! 😍 #HBDIlayaraja #WhistlePodu pic.twitter.com/dNQv0KnTdP
— chennai Super Kings (@ChennaiIPL) June 2, 2020
ఐపీఎల్ తో తన రీ ఎంట్రీని చేద్దాం అనుకున్నాడు కానీ కరోనా పుణ్యమా అని అది కాస్త వాయిదా పడుతూనే ఉంది. దీనితో ధోని అభిమానులు గ్రౌండ్ లో ఎప్పుడు అడుగు పెడతాడో అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.