బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్  ఆత్మహత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈరోజు ముంబైలో బాంద్రాలో వున్న తన అపార్ట్మెంట్ లో సుశాంత్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  సుదీర్ఘ కెరీర్ వున్నసుశాంత్ ఇలా ఎందుకు చేశాడనేది మాత్రం ఎవరికి అంతుబట్టడం లేదు అయితే కొన్ని రోజులుగా సుశాంత్ మానసికంగా కుంగిపోయి టార్చర్  అనుభవించాడని ఈనేపథ్యంలో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు సరిగ్గా 5రోజుల క్రితం సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కూడా ఆత్మహత్య చేసుకుంది. దాంతో వీరిద్దరి మరణాలకు లింక్ ఉందా అనే కోణంలో కూడా  పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
ఇదిలావుంటే సుశాంత్ మరణం తీవ్రంగా కలిచివేసిందని అన్నాడు భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. సుశాంత్ మరణం గురించి ట్విట్టర్ ద్వారా స్పందించిన ఇర్ఫాన్.. చివరి సారి సుశాంత్ ను తాజ్ హోటల్ జిమ్ లో కలిశాను. కేదర్నాథ్ సినిమాలో అతని నటనను మెచ్చుకున్నాను బదులుగా సుశాంత్.. బాయ్, ఛిచ్చోరె కూడా చూడండి మీకు నచ్చుతుందని అన్నాడని పఠాన్ ట్వీట్ చేశాడు. ఇక కై పో చే తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సుశాంత్, ఎంఎస్ ధోని బయోపిక్ లో ధోని పాత్రలో నటించి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: