సుమారు మూడు నెలల విరామం అనంతరం ఇంగ్లాండ్ -వెస్టిండీస్ జట్ల మధ్య జరుగనున్న మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ తో  అంతర్జాతీయ క్రికెట్ పున:ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే వెస్టిండీస్ ,ఇంగ్లాండ్ కు చేరుకోగా ప్రస్తుతం ఇరు జట్లు ప్రాక్టీస్ లో పాల్గొంటున్నాయి. ఇక ఈ మ్యాచ్ లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ). ఈసిరీస్ బయో సెక్యూర్ వాతావరణంలో జరుగనుండగా మ్యాచ్ ల వీక్షించేందుకు మైదానాల్లోకి  ప్రేక్షకులకు అనుమతి లేదు. సోనీ సిక్స్ ఈసిరీస్ ను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. 
 
జులై 8న సౌతాంఫ్టన్ వేదికగా ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు జరుగనుంది. ఈటెస్టు సిరీస్ కు 21 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది క్రికెట్ వెస్టిండీస్. ఇందులో 14మంది జట్టు సభ్యులు కాగా మరో 11మందిని రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికచేసింది అయితే  కరోనా భయం వల్ల  స్టార్ ఆటగాళ్లు హేట్మేయర్ , బ్రావో , కీమో పాల్ ఈ పర్యటనకు  దూరంగా వున్నారు. ఇక ఇంగ్లాండ్ ఇంకా స్క్వాడ్ ను ప్రకటించలేదు. అయితే మొదటి టెస్టు కు కెప్టెన్ రూట్  దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జులై మొదటి వారంలో రూట్ భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుంది దాంతో రూట్  తొలి టెస్టు కు అందుబాటులో వుండకపోవచ్చని సమాచారం. ఒకవేళ రూట్ దూరమైతే వైస్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సారథిగా వ్యవహరించనున్నాడు.
 
ఈ సిరీస్ తరువాత  సొంత గడ్డపై ఇంగ్లాండ్, పాకిస్థాన్ తో తలపడనుంది. జూన్ చివర్లో  పాక్ ,ఇంగ్లాండ్ కు చేరుకోనుంది. ఈపర్యటనలో ఆతిథ్య జట్టు తో పాక్ మూడు టెస్టులు, మూడు టీ 20ల సిరీస్ ఆడాల్సివుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: