పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ మహమ్మద్ హఫీజ్ కు కరోనా పాజిటివ్ వచ్చిన్నట్లు పీసీబీ నిన్న ప్రకటించింది. అతని తోపాటు జట్టులో మొత్తం 10మందికి కరోనా పాజిటివ్ వచ్చిన్నట్లు అధికారికంగా వెల్లడించింది అయితే వీరిలో ఏ ఒక్కరికి కూడా కరోనా లక్షణాలు లేవు దాంతో అనుమానం వచ్చి హఫీజ్ ఈరోజు తన కుటుంబంతో కలిసి మరోసారి కరోనా పరీక్షలు చేయించుకోగా తాజాగా నెగిటివ్ వచ్చింది. హఫీజ్ తో పాటు తన కుటుంబ సభ్యులందరికి నెగిటివ్ వచ్చినట్లు హఫీజ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు అంతేకాదు దానికి సంబందించిన మెడికల్ రిపోర్ట్ ను కూడా పోస్ట్ చేశాడు. 
 
ఇక నిన్న పాజిటివ్ వచ్చిన మిగితా క్రికెటర్లు కూడా మరోసారి కరోనా టెస్టులు చేయించుకోవడానికి సిద్దపడుతున్నారు. ఇంగ్లాండ్ టూరు నేపథ్యంలో పీసీబీ  ఆటగాళ్లందరికి కరోనా టెస్టులు చేయిస్తుంది. ఈనేపథ్యంలో ఆటగాళ్లకు కరోనా ఉందని బయటపడింది. ఇక ఈనెల 28న నెగిటివ్ వచ్చిన ఆటగాళ్లు ఇంగ్లాండ్ వెళ్లనున్నారు. మరి ఇప్పుడు హఫీజ్ కు నెగిటివ్ రావడంతో ఇంగ్లాండ్ పర్యటనకు పీసీబీ అతన్ని పంపిస్తుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: