భారత మాజీ సారథి ,వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని ఈరోజు తన 39వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. సందర్భంగా అభిమానులతో పాటు సహచరులు ,ధోనికి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున  విషెస్ తెలియజేస్తున్నారు అందులో భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన విషెస్ తెలియజేశాడు. హ్యాపీ బర్త్ డే మహి బాయ్.. మీరు ఎల్లప్పుడు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశాడు అలాగే సురేష్ రైనా ,అశ్విన్ తదితరులు కూడా ధోనికి విషెస్ తెలియజేశారు. 
 
ఇదిలావుంటే గత ఏడాది ప్రపంచకప్ తరువాత క్రికెట్ కు దూరమయ్యాడు ధోని అయితే  ఈఏడాది ఐపీఎల్ తో  మళ్ళీ రీఎంట్రీ ఇస్తాడనుకుంటే కరోనా వల్ల ఐపీఎల్ కాస్త వాయిదాపడింది కాగా అక్టోబర్ - నవంబర్ లో బయటి దేశంలో ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ ఆసక్తి చూపిస్తుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: