భారత మాజీ సారథి,ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈరోజు తన 48వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈసందర్భంగా అభిమానులు, క్రికెటర్లు .. గంగూలీకి సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అందులో భాగంగా టీమిండియా క్రికెటర్లు  శిఖర్ ధావన్ , అశ్విన్ , రహానే లు  ట్విట్టర్ ద్వారా విషెష్ తెలియజేశారు. ఇక గంగూలీని ముద్దుగా బెంగాల్ టైగర్ ,దాదా అని కూడా పిలుస్తారని తెల్సిందే. ప్రస్తుతం బెంగాల్ టైగర్ అనే ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.
 
ఇదిలావుంటే ఫిక్సింగ్ ఆరోపణలతో కూరుకుపోయి అంధకారంలో పడ్డ భారత జట్టు ను పగ్గాలు చేప్పట్టి గంగూలీ ఉన్నత స్థానంలో నిలబెట్టాడు అలాగే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని జట్టును ముందుండి నడిపించి ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించాడు గంగూలీ అంతేకాదు యువ ఆటగాళ్లను ప్రోత్సహించి జట్టు భవిష్యత్తుకు బాటలు వేశాడు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: