కరోనా వల్ల గత నాలుగు నెలలుగా స్థంభించిపోయిన అంతర్జాతీయ క్రికెట్.. ఇంగ్లాండ్ -వెస్టిండీస్ టెస్టు సిరీస్ తో తిరిగి ప్రారంభమైంది. ఈసిరీస్ లో భాగంగా జరిగిన మొదటి టెస్టులో ఇంగ్లాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది వెస్టిండీస్. ఈమ్యాచ్ ఉత్కంఠగా సాగి క్రికెట్ అభిమానులను ఎంటర్టైన్ చేసింది.
 
ఇక ఈమ్యాచ్ పై భారత సారథి విరాట్ కోహ్లీతో పాటు  మాజీ క్రికెటర్లు, ట్విట్టర్ ద్వారా స్పందించారు. అందులో భాగంగా వావ్ విండీస్.. వాట్ ఏ విన్ అంటూ కోహ్లీ ట్వీట్ చేయగా..టెస్టు ఫార్మటులో విండీస్ అదరగొడుతుందంటూ.. ఇంగ్లాండ్ పై గెలిచినందుకు విండీస్ టీంకు అభినందనలు తెలుపుతూ మాజీ క్రికెటర్లు సెహ్వాగ్ , ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశారు. 
ఈవిజయంతో మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో వెస్టిండీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఈనెల 16నుండి మాంచెస్టర్ లో ప్రారంభం కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: