అయితే సాధారణంగా అయితే ఈ ఐపీఎల్ సీజన్ బీసీసీఐ సెలక్టర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఐపీఎల్ తర్వాత టీమ్ ఇండియా జట్టు ఆడే మ్యాచ్ లలో ఆటగాళ్ళని సెలెక్ట్ చేయాలి అనే విషయం ఐపీఎల్ సీజన్ లో రాణించిన ఆటగాళ్లను దృష్టిలో పెట్టుకోవడం తో బిసిసిఐ కలెక్టర్లకు ఎంతో సులభం గా మారిపోతుంది. ఎంతో మంది యువ ఆటగాళ్లు కూడా టీమిండియాలో అవకాశం పొందుతూ ఉంటారు అనే విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్లో ఇప్పటికే భారత జట్టులో స్థానం సంపాదించిన ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తూ ఉండగా యువ ఆటగాళ్లు కూడా అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు.
ఈ క్రమంలోనే ఐపీఎల్ తర్వాత టీమిండియా జట్టు సెలెక్షన్ విషయం ప్రస్తుతం బీసీసీఐకి పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా భారత ఓపెనర్లు విషయంలో అయితే బిసిసిఐకి చిక్కు వచ్చి పడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఐపీఎల్ సీజన్ లో కె.ఎల్.రాహుల్ అద్భుతంగా రాణిస్తూ సెంచరీలు బాదుతూన్నాడు.. అదే సమయంలో శిఖర్ ధావన్ కూడా ఢిల్లీ కాపిటల్ జట్టులో కీలక ఆటగాడిగా ఎంతో అద్భుతంగా రాణిస్తున్నాడు... మరోవైపు మయాంక్ అగర్వాల్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. వీరు ముగ్గురు ఓపెనర్లు.. అయితే ఐపీఎల్ తర్వాత ఈ ముగ్గురిలో టీమిండియాకి ఎవరిని సెలెక్ట్ చేయాలి అన్నది బిసిసిఐకి ఒక చిక్కుముడి లా మారిపోయింది అని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.