మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టలేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్ సీజన్ లో రాణించి మళ్లీ భారత జట్టులో స్థానం సంపాదించాలి అని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ప్రేక్షకుల ఊహకందని విధంగా ఆగస్టు 15వ తేదీన ధోని తన రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత అభిమానులు నిరాశ లో మునిగిపోయారు. అంతలోనే ఐపీఎల్ ప్రారంభమవుతుంది అన్న ప్రకటన రావడంతో ఐపీఎల్ లో నైనా ధోన్ ఈ ఆటను చూసి మురిసిపోవాలి అభిమానులు భావించారు. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టైటిల్ ఫేవరెట్గా మరోసారి రంగంలోకి దిగింది. కానీ అభిమానుల అంచనాలు తారుమారయ్యాయి.
.
దాదాపు ఏడాదిన్నర తర్వాత మైదానంలో కి దిగి ధోని అదరగొడతాడు అనుకుంటే మళ్లీ అదే పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్ 2020 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏకంగా తొమ్మిది మ్యాచ్ ఆడితే ధోని ఒక్కటంటే ఒక్క మ్యాచ్లో కూడా సరిగా రాణించలేకపోయారు. తన స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. జట్టుకు అండగా నిలబడి భారీ స్కోరు చేసే ధోనీ ఈసారి మాత్రం డబుల్ డిజిట్ స్కోరు కూడా సాధించలేక సతమతమవుతున్నాడు. దీంతో ధోనీ నీకు ఏమైంది అని అభిమానులు అందరూ నిరాశలో మునిగిపోతున్నారు.