అయితే ఐపీఎల్ 2020 సీజన్ లో భాగంగా నేడు... ఢిల్లీ క్యాపిటల్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ లో ఈ రెండు జట్ల గణాంకాలు చూసుకుంటే పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. మొదటి నుంచి వరుస ఓటములు చవి చూస్తూ పడుతూ లేస్తూ ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు... గత రెండు మ్యాచ్ ల నుంచి విజయాలు సాధిస్తూ ప్లే ఆఫ్ ఆశయాలను ఇంకా సజీవంగానే ఉంచుకుంటుంది... అదే సమయంలో వరుస విజయాలతో దూసుకుపోతూ పాయింట్ల పట్టిక లో టాప్ ప్లేస్ లో ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.
ప్రత్యర్థి జట్టు ఏదైనా చిత్తుగా ఓడిస్తూ ఎంతో సునాయాసంగా ఘన విజయాలను సాధిస్తూ ఈ సీజన్లో అదరగొడుతూ దూసుకుపోతుంది యువ ఆటగాళ్లతో కూడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. ఇక ఈ రెండు జట్ల మధ్య నేడు సాయంత్రం ఏడున్నర గంటలకు మ్యాచ్ జరగబోతున్న విషయం తెలిసిందే. మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తి కరం గా మారిపోయింది. అయితే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలి అంటే ప్రతి మ్యాచ్ కూడా తప్పక గెలవాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఏ జట్టు గెలుస్తుంది అన్నది ప్రస్తుతం ఆసక్తి కరం గా మారిపోయింది.