ఐపీఎల్ 2020 సీజన్ ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్ కూడా నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగుతున్న నేపథ్యంలో... స్టేడియం లకు వెళ్లక పోయినప్పటికీ టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులకూ అంతకుమించి అనేంతలా ప్రస్తుతం ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందుతోంది. ఇక ప్రస్తుతం ఐపీఎల్ వస్తుందంటే చాలు లోకాన్ని మరచిపోయి మరి టీవీల ముందు కూర్చొని టీవీలకు అతుక్కుపోతున్నారు క్రికెట్ ప్రేక్షకులు. ఇక ఏ జట్టు గెలుస్తుంది అన్నది ముందుగానే ఊహిస్తున్నారు. అయితే కొన్ని కొన్ని సార్లు ప్రేక్షకుల అంచనాలు తారుమారు అవుతూ ఒక జట్టు గెలుస్తుంది అనుకుంటే మరో జట్టు గెలుస్తుంది అన్న విషయం తెలిసిందే.


అయితే ఐపీఎల్ 2020 సీజన్ లో భాగంగా నేడు... ఢిల్లీ క్యాపిటల్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ లో  ఈ రెండు జట్ల గణాంకాలు చూసుకుంటే పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. మొదటి నుంచి వరుస ఓటములు చవి చూస్తూ పడుతూ లేస్తూ ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది  కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు... గత రెండు మ్యాచ్ ల నుంచి విజయాలు సాధిస్తూ ప్లే ఆఫ్ ఆశయాలను ఇంకా సజీవంగానే ఉంచుకుంటుంది... అదే సమయంలో వరుస విజయాలతో దూసుకుపోతూ పాయింట్ల పట్టిక లో టాప్ ప్లేస్ లో ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.




 ప్రత్యర్థి జట్టు ఏదైనా చిత్తుగా ఓడిస్తూ  ఎంతో సునాయాసంగా ఘన విజయాలను సాధిస్తూ ఈ సీజన్లో అదరగొడుతూ  దూసుకుపోతుంది యువ ఆటగాళ్లతో కూడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. ఇక ఈ రెండు జట్ల మధ్య నేడు సాయంత్రం ఏడున్నర గంటలకు మ్యాచ్ జరగబోతున్న విషయం తెలిసిందే. మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తి కరం గా మారిపోయింది. అయితే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలి అంటే ప్రతి మ్యాచ్ కూడా తప్పక గెలవాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఏ జట్టు గెలుస్తుంది అన్నది ప్రస్తుతం ఆసక్తి కరం గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: