ప్రతి ఐపీఎల్ సీజన్ లో ఎన్నో అంచనాల మధ్య రంగంలోకి దిగి చివరికి లీగ్ దశతో  సరిపెట్టుకుని అభిమానులకు నిరాశను మిగులుస్తుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఎంతో ప్రతిభ గల ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పటికీ సరిగ్గా ప్రదర్శన చేయలేక చివరికి వరుస ఓటములు చవిచూసి ఎప్పుడు విమర్శలు ఎదుర్కొంటు  ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కనీసం ఒక్కసారైనా సత్తా చాటి ఫైనల్కు చేరి టైటిల్ గెలవాలని అభిమానులు ఎప్పుడు కసితో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈసారి కూడా ఐపీఎల్ టైటిల్ ఫేవరెట్ గా రంగంలోకి దిగింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.



 కానీ ఈ ఐపీఎల్ సీజన్లో మునుపటిలా కాకుండా ఎంతో పట్టుదలతో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ వరుస విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. అయితే ఇక జట్టు ఆడుతున్న తీరు చూసి ఇన్ని రోజుల వరకు నిరాశలో మునిగిపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులందరూ సంతోషం లో ఉబ్బి తబ్బిబ్బు అవుతున్న విషయం తెలిసిందే. జట్టులోని ప్రతి ఆటగాడు కూడా అద్భుతంగా ఆడుతూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎంతో పటిష్టంగా మారింది అని అటు మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.



 ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అయితే ఈ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ కొట్టడం పక్క ఇది రాసి పెట్టుకోండి అంటూ అందరికీ ఛాలెంజ్ కూడా విసరడం మరింత ఆసక్తికరంగా మారింది. ఈసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు జోరు చూస్తుంటే టైటిల్ గెలవడం ఖాయం అనే విధంగానే ఉంది. ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 7 మ్యాచ్లలో విజయం సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. దీంతో ఈసారి ఆర్సిబి తప్పక టైటిల్ గెలుస్తుందని అభిమానులందరూ ఫుల్ ఖుషి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: