ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతున్న విషయం తెలిసిందే. నేడు  జరగబోయే మ్యాచ్ కూడా ఎంతో ఆసక్తికరంగా మారిపోతుంది. ఎందుకంటే నేడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ రెండు జట్లకు  కూడా ఎంతో కీలకంగా మారనుంది. ఎందుకంటే ఐపీఎల్ సీజన్ లో మొదటి నుంచి పడుతూ లేస్తూ ఎంతో నెమ్మదిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టాయి ఈ రెండు జట్లు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్లే ఆఫ్ ఆశలు సజీవం గా ఉంచుకోవడానికి హోరా హోరీగా పోరాటం చేస్తున్నాయి.



 ప్రస్తుతం వరుసగా మూడు విజయాలతో దూసుకుపోతుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు. మరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ జట్టుపై మంచి విజయాన్ని అందుకుని ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇక నేడు జరగబోయే మ్యాచ్ రెండు జట్లకు చావో రేవో తేల్చుకునే మ్యాచ్ గా మారనుంది. ఎందుకంటే ఈరోజు తలబడే  రెండు జట్లు కూడా ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన ఉంది. దీంతో హోరాహోరీగా ఈ రెండు జట్ల మధ్య పోరు జరగబోతుంది అందరూ ప్రస్తుతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.



 ఈ క్రమంలోనే నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అటు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు లో బ్యాటింగ్ విభాగం బౌలింగ్ విభాగం కూడా ఎంతో పటిష్టంగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే సన్ రైజర్స్ ఆడిన మ్యాచ్ లో జట్టు మిడిల్ ఆర్డర్ కూడా ఫామ్ లోకి  రావడం జట్టుకు ఎంతో కలిసొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సన్రైజర్స్ బౌలింగ్ విభాగం పటిష్టంగానే ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: