ఇక నిన్న ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ మొత్తం నరాలు తెగే ఉత్కంఠ మధ్య హోరాహోరీగా జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు ఏకంగా 196 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ ముందు ఉంచింది. ఈ క్రమంలోనే ఇక రాజస్థాన్ రాయల్స్ గెలవడం కష్టమనే అని ప్రేక్షకులు అందరూ భావించారు. కానీ రాజస్థాన్ రాయల్స్ జట్టు మాత్రం ఊహించని విధంగా కమ్ బ్యాక్ చేసింది అనడంలో అతిశయోక్తి లేదు. 196 పరుగుల లక్ష్యాన్ని ఎంతో అలవోకగా చేధించింది రాజస్థాన్ రాయల్స్ జట్టు. దీంతో ఘన విజయాన్ని అందుకుంది.
ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ జట్టులో బెన్ స్టోక్స్ చెలరేగి ఆడి వేగంగా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక సంజూ శాంసన్ కూడా మళ్లీ ఫామ్ లోకి వచ్చి అర్థ సెంచరీ పూర్తి చేసుకోవడంతో రాజస్థాన్ రాయల్స్ ఎంతో సునాయాసంగా విజయం సాధించింది. అయితే నిన్న రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతయ్యాయి. దీంతో ఐపీఎల్ టోర్నీలో లీగ్ దశలోనే ఎలిమినేట్ అయిన మొదటి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలవడం గమనార్హం. రాజస్థాన్ విజయంతో చెన్నై కి భారీ షాక్ తగిలింది.