కానీ ఈసారి మాత్రం అంచనాలకు తగ్గట్లుగా ఆడకుండా ఏకంగా ఐపీఎల్ నుంచి ఎలిమినేట్ అయిన మొదటి జట్టు గా నిలిచిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే అభిమానులు అందరూ నిరాశలో మునిగిపోయారు. అయితే మొదటి నుంచి వారితో ఓటమి చవి చూస్తూ వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు... ఇటీవలె రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తో జరిగిన మ్యాచ్ లో గెలిచినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ జట్టు గెలవడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు మొత్తం గల్లంతయ్యాయి. దీంతో మొదటి సారి ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆప్ కి చేరకుండానే వెనుదిరిగింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.
తాజాగా ఇదే విషయంపై స్పందించిన మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి భావోద్వేగ పూరితమైన పోస్ట్ పోస్ట్ సోషల్ మీడియా వేదికగా పెట్టారు. ఆటలో గెలుపు ఓటములు సహజం అంటూ తెలిపిన సాక్షి తన దృష్టిలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎప్పుడు విన్నరే అంటూ వ్యాఖ్యానించింది. ఇది కేవలం ఆట మాత్రమే.. కొన్నింటిలో గెలుస్తారు కొన్నింటిలో ఓడిపోతారు... మీరు ఎప్పుడు విజేతలే.. అప్పుడు కూడా విజేతలే... కొంతమంది మాత్రమే యుద్ధం చేయడానికి పుడుతూ ఉంటారు.. వాళ్లు అభిమానుల గుండెల్లో ఎప్పుడూ సూపర్ కింగ్స్ గానే ఉండిపోతారు అంటూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ సతీమణి సాక్షి సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది.