మొదటి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రస్తుతం ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవడం కోసం హోరాహోరీ గా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు వరుస పరాజయాలు ఎదుర్కొంటూ పాయింట్ల పట్టికలో రోజురోజుకు కిందికి దిగజారిపోయిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు... ఇప్పుడు మాత్రం వరుస విజయాలను అందుకుంటూ దూసుకు పోతుంది. దీంతో సన్రైజర్స్ జట్టు అభిమానులందరిలో  కొత్త ఆశలు చిగురిస్తున్నాయి అనే చెప్పాలి. ప్రస్తుతం బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగంలో ఫీల్డింగ్ విభాగంలో ఎంతో అద్భుత ప్రదర్శన కనబరిచింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.



 దీంతో మునుపెన్నడూ లేనివిధంగా ఘన విజయాలను అందుకుంటుంది.  ముఖ్యంగా నిన్న జరిగిన మ్యాచ్ లో అయితే ఈ ఐపీఎల్ సీజన్ లోనే ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో ఘన విజయాన్ని అందుకుంది అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. వరుస విజయాలతో దూసుకుపోతూ ఐపీఎల్ సీజన్ లో దిగిన జట్టుగా కొనసాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.  ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ కాపిటల్స్ గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు  అద్భుతంగా రాణించి ఎవరూ ఊహించని విధంగా 219 పరుగుల ను ప్రత్యర్థి ముందు ఉంచింది.  ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్  జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది అనే చెప్పాలి.



 సన్రైజర్స్ బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది ఢిల్లీ క్యాపిటల్స్.  ఇక వరుసగా వికెట్లు కోల్పోవడంతో కనీస పరుగులు కూడా చేయలేక పోయింది. దీంతో దిగ్గజ  జట్టుగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు  కేవలం 131 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో ఐపీఎల్ సీజన్ లో ఏ జట్టు సాధించని విధంగా 88 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. రానున్న రోజుల్లో కూడా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే ఫామ్  కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: