ఇక ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల అంచనాలన్ని తారుమారు అవుతున్నాయి. ఎందుకంటే ఐపీఎల్ సీజన్ లో ఇప్పటి వరకు ఎంతో విజయవంతంగా ప్రస్థానాన్ని కొనసాగించి.. దిగ్గజ జట్లుగా కొనసాగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు వరుసగా పరాజయాలు చవి చూస్తున్నాయి. అదే సమయంలో మొన్నటి వరకు వరుస పరాజయాలతో విమర్శలు ఎదుర్కొన్న జట్లు ప్రస్తుతం ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవడం కోసం వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ పాయింట్ల పట్టికలో పైపైకి పాకుతున్నాయి.
ముఖ్యంగా పాయింట్ల పట్టికలో చివరన ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు వరుసగా ఐదు విజయాలను సొంతం చేసుకొని నాలుగవ స్థానానికి ఎగబాకింది. ఇక నిన్న ఢిల్లీ కాపిటల్స్ పై సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది. అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో ప్రేక్షకులు అంచనాలన్నీ తారు మారు అయిపోతున్నాయి. ఏ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుంది అన్నది కూడా ప్రేక్షకుల ఊహకందని విధంగా ఉంది. దీంతో ఐపీఎల్ పోరు మరింత రసవత్తరంగా ఉత్కంఠగా మారిపోయింది అని చెప్పాలి.