ఇక ప్రస్తుతం విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సారథిగా వ్యవహరిస్తూ యూఏఈ వేదికగా ఐపీఎల్ టోర్నీ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అనుష్క శర్మ కూడా క్వారంటైన్ పూర్తి చేసుకొని ప్రస్తుతం విరాట్ కోహ్లీతో సమయం గడుపుతున్నది . ఇక్కడ విరాట్ కోహ్లీ మైదానంలో ఆడుతున్న సమయంలో అనుష్క శర్మ స్టాండ్స్ లో ఉండి ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఒక్కొక్కసారి మైదానంలో వీరిద్దరి మధ్య జరిగే సైగలు కూడా ప్రేక్షకులను మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుంటాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.
నిన్న ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ఆడుతున్న సమయంలో మధ్యలోనే స్టాండ్స్ లో కూర్చున్న అనుష్క శర్మ కు కోహ్లీ సైగలు చేయడం కెమెరాలకు చిక్కింది. అనుష్క శర్మకు సైగలు చేస్తూ భోజనం చేసావా అని అడిగాడు విరాట్ కోహ్లీ అనుష్క శర్మ సమాధానంగా తన బొటన వేలు ని చూపించింది. ఇది చూసిన విరాట్ కోహ్లీ ముసిముసిగా నవ్వుకున్నాడు. ఈ ఘటన నిన్న కెమెరాలకు చిక్కడంతో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులందరూ మురిసిపోయారు.