నిన్న కోల్కతా నైట్రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల  మధ్య మ్యాచ్  హోరాహోరీగా జరిగిన విషయం తెలిసిందే. చివరి బాల్ వరకు కూడా నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరికి ఏ జట్టు విజయం సాధిస్తుంది అన్నది కూడా ఊహకందని విధంగా ఉంది నిన్నటి మ్యాచ్ లో. నిన్న జరిగిన మ్యాచ్ లో యువ బ్యాట్స్మెన్ ఋతురాగ్  గైక్వాడ్  ఎంతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి  మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఏకంగా  72 పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత చివరిలో రవీంద్ర జడేజా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో చెన్నై సూపర్ కింగ్స్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం మాట్లాడిన ధోనీ యువ ఆటగాడు ఋతురాగ్  గైక్వాడ్ పై ప్రశంసలు కురిపించాడు.



 యువ బ్యాట్స్మెన్ ఋతురాగ్  గైక్వాడ్ కరోనా వైరస్ బారిన పడటం కారణంగా అతని సామర్థ్యాన్ని అంచనా వేయలేక పోయాము  అంటూ చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. కేవలం ఈ ఒక్క మ్యాచ్లో మాత్రమే చివర్లో తమకు కలిసి వచ్చింది అంటూ ధోని చెప్పుకొచ్చాడు. ఈ క్రెడిట్ మొత్తం తమ జట్టులోని ఆటగాళ్లదే అంటూ తెలిపిన మహేంద్రసింగ్ ధోని ఈ సందర్భంగా ఋతురాగ్  గైక్వాడ్ పై ప్రశంసలు కురిపించాడు, ఇప్పటివరకు ఎవరికైతే జట్టులో  అవకాశాలు రాలేదో  వారిని ఆడించాలని అనుకున్నామని ఈ క్రమంలోనే ఋతురాగ్  గైక్వాడ్ కీ అవకాశం ఇచ్చినట్లు తెలిపారు.



 వచ్చిన అవకాశాన్ని ఎంతో సమర్థవంతంగా వినియోగించుకున్న ఋతురాగ్  గైక్వాడ్ తన  ప్రతిభను నిరూపించుకున్నారు అంటూ ధోని ప్రశంసలు కురిపించాడు. యూఏఈ చేరుకున్న తర్వాత ఋతురాగ్  గైక్వాడ్ కరోనా  వైరస్ బారిన పడడంతో అతనికి సామర్థ్యాన్ని అంచనా వేయలేక పోయాము  అంటూ తెలిపాడు. అయితే ప్రస్తుతం ప్లే ఆఫ్  చేరే అవకాశాలు తమ జట్టుకు లేకపోయినప్పటికీ రాబోయే సీజన్లలో సరైన ఆటగాళ్లు మాకు ఉన్నారు  అంటూ చెప్పుకొచ్చాడు ధోని . కాగా కోల్కతా నైట్రైడర్స్ జట్టు తప్పక గెలవాల్సిన మ్యాచ్లో జడేజా  అద్భుతంగా రాణించడంతో అనూహ్యమైన విజయాన్ని అందుకుంది అనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: