భారత క్రికెట్లో సురేష్ రైనా కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎప్పుడు భారత క్రికెట్ లో మూడవ స్థానంలో బరిలోకి దిగి ఎంతో బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడుతూ భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాడు సురేష్ రైనా. ఇక భారత్ లో ఎంతో క్రేజ్ సంపాదించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అయితే సురేష్ రైనా ఎన్నో రికార్డులను సృష్టించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగిన సురేష్ రైనా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఆప్తుడిగా జట్టులో కీలక బ్యాట్మెన్గా ప్రస్థానాన్ని కొనసాగించారు.



 ఇక భారత జట్టులో కూడా ప్రపంచ కప్  విజయంలో సురేష్ రైనా కీలక పాత్ర వహించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. అయితే ధోనీ కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుకున్న తర్వాత భారత జట్టులో సురేష్ రైనా అవకాశాలు తగ్గిపోయాయి అన్న  విషయం తెలిసిందే.  తరువాత ఇటీవలే ధోని రిటైర్మెంట్ ప్రకటించడం తో.. ధోని వెంటే సురేష్ రైనా కూడా నడిచాడు. ధోనీతో పాటు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు సురేష్ రైనా. ఇటీవలే కుటుంబ సమస్యల నేపథ్యంలో సురేష్ రైనా ఐపీఎల్ నుంచి కూడా నిష్క్రమించడం అభిమానుల్లో నిరాశ నింపింది.


 ఐపీఎల్ నుంచి తప్పుకున్నప్పటికీ అభిమానులందరినీ తన మంచి మంచి పనులతో ఉత్సాహం నింపుతున్నారు సురేష్ రైనా. గతంలో జమ్మూకాశ్మీర్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రతిభ గల యువ ఆటగాళ్లను తెర మీదకు తెచ్చేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తన పుట్టినరోజు సందర్భంగా మరోసారి సేవా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమయ్యారు సురేష్ రైనా. ఈనెల 27వ తేదీన తన పుట్టిన రోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేయబోతున్నా అని  ఇటీవలే ప్రకటించారు సురేష్ రైనా. ఉత్తర ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాలలో 34 ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించేందుకు సురేష్ రైనా నిర్ణయించినట్లు తెలుస్తోంది. తన కుమార్తె పేరుతో ఉన్న గ్రేషియా రైనా  ఫౌండేషన్ పేరుతో ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు సురేష్ రైనా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: