అయితే మొదటి మ్యాచ్ లో క్రీజులోకి వచ్చి అద్భుతంగా రాణించి మెరుపు ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్ పాండ్యా ఇక రెండో మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణిస్తారు అనుకున్న సమయంలో హార్థిక్ పాండ్య అందరి నిరాశపరిచాడు అనే విషయం తెలిసిందే. తక్కువ పరుగులకే వికెట్ కోల్పోయి పెవిలియన్ చేరాడు అయితే ఇటీవలే వన్డే సిరీస్ చేజార్చుకోవడం పై స్పందించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు మొదట లక్ష్య ఛేదనలో శుభారంభం పొందినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఆస్ట్రేలియా బౌలర్లు పుంజుకోవడంతో లక్ష్యాన్ని ఛేదించడం కష్టతరంగా మారింది అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే భారత ఆల్ రౌండర్ హార్థిక్ పై తాను ఎంతగానో నమ్మకాన్ని పెట్టుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ 10 ఓవర్లలో 100 పరుగులు చేయాల్సిన సమయంలో క్రీజ్లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు విజయం అందిస్తాడు అని అనుకున్నాను కానీ హార్దిక్ పాండ్యా తక్కువ పరుగులకే ఏడు వికెట్ కోల్పోవడంతో టీమిండియా కష్టాల్లో పడింది అంటూ చెప్పుకొచ్చాడు. 40 ఓవర్ల వరకు కె.ఎల్.రాహుల్ తాను క్రీజు లోనే ఉండి ఉంటే బాగుండేది అనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. తరువాత మ్యాచ్ లలో పుంజుకొని మరింత బాగా ఆడటానికి ప్రయత్నిస్తాం అంటూ చెప్పుకొచ్చాడు.