ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టుకు అడుగడుగున నిరాశే ఎదురవుతుంది అన్న విషయం తెలిసిందే . దాదాపు 9 నెలల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న టీమ్ ఇండియా జట్టు ఆస్ట్రేలియా గడ్డపై శుభారంభాన్ని ప్రారంభించాలని అనుకుంటే రెండు మ్యాచ్ లలో కూడా తీవ్ర నిరాశే ఎదురైంది. ఇక మొదటి సిరీస్ చేజారిపోయింది. దీంతో భారత అభిమానులు తీవ్ర నిరాశ లో మునిగిపోయారు ముఖ్యంగా.. ఆస్ట్రేలియా గడ్డపై భారత బౌలింగ్ విభాగం సరిగ్గా రాణించలేక పోతుంది అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ధాటికి టీమ్ ఇండియా బౌలింగ్ విభాగం పూర్తిగా తేలిపోతుంది. దీంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయగలుగుతోంది.



 ఈ క్రమంలోనే మొదటి వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు టీమిండియా ఉంచిన  భారీ టార్గెట్ ను చేధించ లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఓటమి చవిచూసింది టీమిండియా ఇక రెండవ వన్డేలో పుంజుకుని సిరీస్పై ఆశలు ఇంకా సజీవంగా ఉంచుకుంటుంది అని అందరూ అనుకున్నారు... కానీ రెండో వన్డేలో కూడా ఓటమి చవిచూడాల్సి పరిస్థితి ఏర్పడింది. మరోసారి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీస్కోరు చేయడంతో.. లక్ష్య ఛేదన చేయలేక టీమిండియా బొక్క బోర్లా పడిపోయింది.



 దీంతో సిరీస్ చేజారి పోయింది. టీమిండియాపై విజయంపై ఇటీవలే ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా పై విజయం సాధించాలి అంటే భారీ స్కోర్ చేయాలి అంటున్నాడు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ వ్యాఖ్యానించాడు. అదృష్టవశాత్తూ జరిగిన రెండు మ్యాచ్ లలో కూడా తాము భారీ స్కోరు చేయగలిగాము అంటూ చెప్పుకొచ్చాడు. తమ జట్టుకు మంచి ఆరంభం లభించింది అంటూ చెప్పుకొచ్చిన స్మిత్.. చివర్లో తాను మాక్స్వెల్ చెలరేగి ఆడటానికి అవకాశం దొరికింది అంటూ చెప్పుకొచ్చాడు. భారీ స్కోరు చేయడం వల్లనే టీమిండియా పై చేయి సాధించగలిగాము  అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు స్మిత్.

మరింత సమాచారం తెలుసుకోండి: