ఐపీఎల్ టోర్నీ ముగియగానే అటు నుంచి అటే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మొదటి వన్డే సిరీస్ ఆడింది అన్న విషయం తెలిసిందే. అయితే మొదటి వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా జట్టు చేతిలో భారత్ ఓటమి చవిచూసింది ఇక వరుసగా రెండు వన్డే మ్యాచ్ లలో  ఓడిపోవడంతో ఒక మ్యాచ్ మిగిలి వుండగానే భారత జట్టు సిరీస్ చేజార్చుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కనీసం నామమాత్రపు మ్యాచ్ అయినా  మూడో వన్డే మ్యాచ్లో  విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని భారత్ జట్టు భావించింది.



 ఈ క్రమంలోనే జట్టులో ఆటగాళ్ళ లో కీలక మార్పులు చేసింది అన్న విషయం తెలిసిందే. జట్టులో చేసిన మార్పులు భారత జట్టుకు ఎంతగానో కలిసి వచ్చాయి అని చెప్పాలి. జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాళ్లు అద్భుతంగా రాణించడంతో చివరికి... మూడో మ్యాచ్లో విజయం సాధించి.. భారత జట్టు పరువు నిలబెట్టుకుంది. ముఖ్యంగా మూడో వన్డే మ్యాచ్లో జట్టులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. భారత విజయంలో కీలక పాత్ర వహించాడు. కీలక సమయంలో మూడు వికెట్లు పడగొట్టడం తో ఆస్ట్రేలియా ఓటమి చవిచూడాల్సినా పరిస్థితి ఏర్పడింది.



 అయితే జట్టులోకి ఎంట్రీ ఇచ్చి మూడు వికెట్లు తీయడం పై స్పందించిన శార్దూల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏకంగా పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఎప్పుడు వచ్చాము  అన్నది కాదు అన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అన్న రేంజ్లో చెప్పుకొచ్చాడు శార్దూల్ ఠాకూర్. జట్టుకు ఎంపిక కావడం అన్నది నా చేతుల్లో లేని పని కానీ జట్టుకు ఎంపిక అయినప్పుడు మాత్రం సాయశక్తులా జట్టును గెలిపించేందుకు ఆడాలి.  ఒకే మ్యాచ్ కి మాత్రమే తాను పరిమితం అవుతానో  లేదా గాయపడిన ఆటగాడి స్థానంలో జట్టులోకి వస్తానో అన్నది నాకు తెలియదు... కానీ ఎప్పుడు వచ్చినా జట్టులో బాగా రాణించడానికి ప్రయత్నిస్తా.. అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: