దీంతో 328 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు వరుణుడు పెద్ద అడ్డంకిగా మారాడు. దీంతో 4వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ కేవలం 4/0 స్కోరుతో నిలిచింది. రోహిత్(4) ఓ ఫోర్తో ఖాతా తెరవగా.. శుభ్మన్ గిల్(0) ఇంకా ఖాతా తెరవలేదు. రాత్రంతా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అంతేకాకుండా ఐదో రోజు ఆటకు కూడా వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలున్నాయని చెబుతోంది. అదే జరిగితే ఈ మ్యాచ్ కూడా డ్రా అయ్యే అవకాశాలు లేకపోలేదు.
ఇక రెండో సెషన్కు కొద్ది సేపటికి ముందు వర్షం కురవడంతో ముందుగానే అంపైర్లు టీ బ్రేక్ ప్రకటించారు. అప్పటికి ఆసీస్ 7 వికెట్లకు 243 పరుగులు చేసింది. కొంత సేపటికి వర్షం తగ్గడంతో మళ్లీ ఆట ప్రారంభించారు. అయితే కొద్ది సేపటికే స్టార్క్(1)ను సిరాజ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లియాన్(13)ను ఠాకూర్ పెవిలియన్ పంపగా చివర్లో హేజల్వుడ్(9)ను మళ్లీ సిరాజ్ దెబ్బ కొట్టాడు. షార్ట్ పిచ్ బంతితో బోల్తా కొట్టించాడు. అయితే ప్యాట్ కమిన్స్(28) మాత్రం నాటౌట్గా నిలిచాడు. ఈ వికెట్తో సిరాజ్ 5 వికెట్ల మార్క్ను కూడా అందుకున్నాడు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా 4/0గా ఉంది. అయితే ఈ సమయంలో మళ్లీ వర్షం కురవడంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపివేశారు. వర్షం భారీగా కువరడంతో కొద్ది సేపటికే ఈ రోజు మ్యాచ్ను ముగించినట్లు ప్రకటించారు.