ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక క్రికెట్లో బాగా రాణించి టీమిండియాకు విజయం అందించిన ఆటగాళ్లను క్రికెట్ ప్రేక్షకులు  అమితంగా ఆరాధిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో టీమిండియా క్రికెట్ లో  ఎప్పటికప్పుడు యువ ఆటగాళ్లు తెర మీదికి వస్తూ  తమ ప్రతిభతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుని అభిమానాన్ని సంపాదించుకున్నారు.  ఇక కొన్ని కొన్ని సార్లు అద్భుతంగా రాణించి హాట్ టాపిక్ గా మారిపోయిన యువ ఆటగాళ్లకు సంబంధించిన ప్రతి విషయం కూడా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ఇటీవలే శుబ్ మన్  గిల్   ఇటీవలె భారత్ సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. మొన్నటి వరకు పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న శుబ్ మన్ గిల్  ఇప్పుడు మాత్రం ఏకంగా 91 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే భారత జట్టు ఎంతో అలవోకగా ఆస్ట్రేలియా జట్టుపై విజయం సాధించింది.  ఈ క్రమంలోనే భారత జట్టు ఓపెనర్ గా శుబ్ మన్ గిల్  తెర మీదికి వచ్చి ప్రస్తుతం యువ సూపర్ స్టార్ గా మారిపోయాడు. అయితే ఇటీవలే సత్తా చాటి సూపర్ స్టార్ గా మారిపోయిన శుబ్ మన్ గిల్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇటీవల జరిగిన టెస్ట్ మ్యాచ్ లో  శుబ్ మన్ గిల్ జేబులో రెడ్ కలర్ కర్చీఫ్  కనిపించింది.



 ఈ క్రమంలోనే ఈ యువ ఆటగాడు రెడ్  కర్చీఫ్ వాడటం వెనుక స్టోరీ ఏంటి అనే దానిపై ప్రస్తుతం భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా నెట్టింట్లో వెతకడం మొదలుపెట్టారు. దీని వెనుక ఏదైనా సెంటిమెంట్ వుందా అని కూడా తెలుసుకునేందుకు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు.  అయితే దీని వెనుక కారణాన్ని ఇటీవలే శుబ్ మన్ గిల్ వెల్లడించాడు.  మొదట అందరి లాగానే తాను కూడా తెల్ల కర్చీఫ్  వాడేవాడిని.. కానీ ఓసారి అండర్ 19 లో మ్యాచ్ ఆడుతున్న ఎరుపు రంగు కర్చీఫ్ వాడిన సమయంలో సెంచరీ చేయడంతో ఎరుపు రంగు రుమాలు సెంటిమెంట్ గా మారిపోయిందని 3 ఏళ్లుగా ఇదే రంగు వాడటం ప్రారంభించా అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: