ఇంకా పలు మాజీ క్రికెటర్లు పలు విదేశీ క్రికెటర్లు టీమిండియా సాధించిన ఈ చరిత్రాత్మక విజయం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రహానే భారత్ సాధించిన అపూర్వ విజయంతో ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన రహానే.."అసలేం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఈ సిరీస్ విజయాన్ని అభివర్ణించేందుకు మాటలు రావడం లేదు. చాలా ఎమోషనల్ అయిపోయాను. అడిలైడ్ టెస్టు పరాజయం తర్వాత ప్రతీ ఒక్క ఆటగాడు పట్టుదలతో ఆడుతూ ఈ సమిష్టి గెలుపులో కీలకపాత్ర వహించారు. ముఖ్యంగా రిషభ్, నట్టు(నటరాజన్), శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ బంతితో, బ్యాట్తో మ్యాజిక్ చేశారు. విజయం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది.. నిజంగా నాకు చాలా ఎమోషనల్ గా ఉంది’’ అంటూ రహానే భావోద్వేగానికి లోనయ్యాడు.
ఇక చివరి టెస్టులో అద్భుత ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర వహించిన టీమిండియా యువ సంచలనం రిషబ్ పంత్ మీడియాతో మాట్లాడుతూ..'నా కల నిజమైంది. నేను ఫామ్లో లేని సమయంలో టీమ్ నాకు మద్దతుగా నిలిచింది. తొలి టెస్ట్ తర్వాత నెట్స్లో చెమటోడుస్తున్నాం. టీమ్ మేనేజ్మెంట్ ఎప్పుడూ నాకు అండగా ఉంది. నేనో మ్యాచ్ విన్నర్ అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించింది. అదే ఇవాళ నేను నిజం చేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది' అని పంత్ చెప్పుకొచ్చాడు.